22, మే 2020, శుక్రవారం

కరోనాపై యుద్ధం.. 1.3 కోట్ల సైన్యం...

భారతదేశంలో దేశవ్యాప్తంగా కరోనా యోధుల లెక్క తేల్చిన కేంద్రం.
పోరులో డాక్టర్ల నుంచి గ్రామీణ డాక్‌ సేవక్‌ల వరకు.
ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, మాజీ సైనికులు, ఆశ వర్కర్లు..
అత్యధిక సంఖ్యలో అంగన్‌వాడీల భాగస్వామ్యం..
కరోనాపై పోరులో తెలంగాణలో 3.36 లక్షల మంది..
ఏపీలో 7.24 లక్షల మంది యోధులు.. 

             రోజుకు ప్రపంచంలో ఎన్ని కొత్త కేసులు వస్తున్నాయి.. మన దేశంలో ఈ రోజు ఎంతమందికి సోకింది..  కానీ అసలు ఈ కరోనా మహమ్మరిపై ఎంత మంది యుద్ధం చేస్తున్నారు? రోజూ మహమ్మారితో ప్రత్యక్షంగా పోరాడుతూ మన దేశంలో, రాష్ట్రంలో వైరస్‌ను నియంత్రిస్తున్నారనే దాని గురించి ఆలోచించారా? కరోనా యోధులుగా పిలిచే వీరి సంఖ్య 1.3 కోట్లకు పైగానే. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనాపై వీరంతా పోరాడుతున్నారు. ఇందులో ఎంబీబీఎస్‌ డాక్టర్ల నుంచి గ్రామీణ డాక్‌ సేవక్‌ల వరకు ఉన్నారని కేంద్ర లెక్కలు చెబుతున్నాయి.

21, మే 2020, గురువారం

ప్రపంచంపై కరోనా పంజా అరకోటి...

చైనాలో తొలి కరోనా కేసు వెలుగు చూసి ఆరు నెలలైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కేసులు అరకోటి దాటేశాయి. 3 లక్షల 25వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. 213 దేశాలకు వైరస్‌ విస్తరించింది. ఇప్పటివరకు ఏ వ్యాధి కూడా ఈ స్థాయిలో ప్రపంచ దేశాలను భయపెట్టలేదు. వ్యాక్సిన్‌ ఇప్పుడప్పుడే వస్తుందన్న ఆశ లేకపోవడంతో కరోనాతో కలిసి బతుకు బండిని సాగించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆర్థికం, ఆరోగ్యం మధ్య సమన్వయం సాధించడం కోసమే దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. మొదట్లో అమెరికా, స్పెయిన్, ఇటలీ దేశాల్లో కరోనా కరాళ నృత్యం చేసింది. ఇప్పుడు రష్యా, బ్రెజిల్, యూకేలో విజృంభిస్తోంది.  





18, మే 2020, సోమవారం

భారతదేశంలో లాక్‌డౌన్‌ మే 31 వరకు ...

భారతదేశంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో
లాక్‌డౌన్‌ మే 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
నిషేధం వీటిపైనే..
''అన్ని జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైల్‌ సర్వీసులు నిషేధం కొనసాగుతుంది. స్కూల్స్‌, కాలేజీలు, ఎడ్యుకేషన్‌, ట్రైనింగ్‌, కోచింగ్‌ సంస్థలు తెరవడానికి వీలు లేదు. ఆన్‌లైన్‌ టెస్టింగ్‌ లెర్నింగ్‌ ఎప్పటిలాగే కొనసాగుతాయి. హోటల్స్‌, రెస్టారెంట్లు, హాస్పిటిలిటీ సర్వీసులు అనుమతి లేదు. సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, జిమ్స్‌, స్విమింగ్‌పూల్స్‌, ఇతర వినోదపార్క్‌లు, థియేటర్స్‌, బార్లు, ఆడిటో రియంలు, అసెంబ్లీ హాల్స్‌ తెరవటానికి అనుమతిలేదు. రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్ర మాలకు అనుమతిలేదు. మతపరమైన సంస్థల్లో ప్రజలకుఅనుమతి లేదు. మతప రమైన ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి లేదు'' అని పేర్కొంది. 

ఒక్కరోజులోనే 4,987:
ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987 పాజిటివ్‌ కేసులు.. ఏకంగా 120 మరణాలు. భారతదేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం ఏమాత్రం ఆగడం లేదనడానికి నిదర్శనాలివీ. కరోనా పాజిటివ్‌ కేసులు 90 వేల మార్కును దాటేయడం గుబులు రేపుతోంది.  దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 90,927కు, మరణాలు 2,872కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.


16, మే 2020, శనివారం

కూలిపోయిన కూలి బతుకులు.. కడుపునింపని ప్యాకేజీలు..

ఎర్రటి ఎండ.. కాళ్లకు సగం సగం ఊడిపోయి ఎప్పుడు తెగిపోతాయో తెలియని చెప్పులు..
 నెత్తిన మూట, పక్కన పదేండ్ల కూతురు, ఆ అమ్మాయి చేతిలో చంటిపాప, భార్య చేతిలో పెద్ద మూట, పక్కన నెత్తిమీద బరువుతో భార్య.. 
ఇలా మొత్తం కుటుంబం వందల కిలోమీటర్లు కాలినడకన సొంతూళ్లకు చేరుకునేందుకు నానా యాతనలు పడుతున్నారు. వందల కిలో మీటర్లు నడుస్తున్నారు. జనం లక్షల సంఖ్యలో ఇప్పటికీ హైవేలలో ముందుకు సాగుతున్నారు.  వీరిలో కొందరు దారిలో ప్రాణాలు వదులుతున్నారు.

తక్షణం వలస కూలీలను ఎలా ఆదుకోవాలనే ఆలోచన ఎక్కడా కనిపించలేదు. వలసకూలీలు ఆకలికీ, నిరుద్యోగానికీ, వందలమైళ్ల నడకకూ భయపడటం లేదు. కానీ పాలకుల వివక్షకు మాత్రం వారు ఆందోళనకు గురవుతున్నారు. నిజమే, కోట్లాది మంది వలసకూలీలను పట్టించుకోని పాలకుల భయానకమైన బాధ్యతా రాహిత్యానికి రోడ్లపాలైన కూలీల బతుకులు, పట్టాలపై, రోడ్లపై విగతజీవులైన వారి జీవన్మృత సాక్ష్యాలు.

లాక్‌డౌన్‌ ప్రకటించి 50 రోజులు దాటింది. అలా ప్రకటించే టప్పుడు పొట్టచేతపట్టుకుని నగరాలకు వలస వచ్చిన కూలీలు పరిస్థితి ఏమిటి? వారెలా జీవిస్తారు? ఎక్కడ ఉంటారు? వీరి బతుకులను ఏం చేయాలనే ఆలోచన, ప్రణాళిక లేకుండా వారిని బతికి ఉండేలా చేయాలనే ధ్యాస లేకుండా లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఈ వలస కార్మికులు 20 కోట్ల వరకు ఉంటారు. వలస కార్మికుల గురించి ప్రభుత్వానికి అవగాహనలేదు. 




11, మే 2020, సోమవారం

మంచి మిత్రుడిని కోల్పోయాం...

మంచి మిత్రుడిని కోల్పోయాం...
రవికి నా నివాళి. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.
సాక్షి దిన పత్రిక ఫోటోగ్రాఫర్ రవి రాత్రి జడ్చర్ల లో కన్ను ముసాడు.దాదాపు 

గత 2 సంవత్సరాలుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నాడు.
సిగ్మ ఆర్ట్ పోటోగ్రాఫి పోటిలో పోట్రైట్ విభాగంలో గోల్డ్ మెడల్, SAAP జాతీయస్థాయి

 ఫొటోగ్రఫీ పోటీలలో అవార్డు, ...అనేక అవార్డులు అవార్డులు అందుకున్నారు.
 పండుగలు, ఎన్నికలు, ఉద్యమాలు, పోరాటలలో... చాల మంచి ఫోటో గ్రాఫర్ గా గుర్తింపు వచ్చింది.
స్నేహశీలి, కష్టజీవి, అరుదైన వ్యక్తిత్వం, అప్యాయంగా పిలిచే అన్న.
రవి గారికి జోహర్లు.




10, మే 2020, ఆదివారం

పేదలకు ఉచిత భోజనాలు పంపిణి...

కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా  హైదరాబాద్ జిందాబాద్ ముషీరాబాద్ డివిజన్ కమిటీ ఆద్వర్యంలో...
( YSR పార్క్ ఏరియా) ఈ రోజు 160 మంది  పేదలకు  ఉచిత భోజనాలు పంపిణి.
గత 20 రోజులుగా పేదలకు ఉచితంగా ప్రతి రోజు ఉదయం 200 మంది టిఫిన్, 

మధ్యాహ్నము 100 మందికి ఉచిత భోజనాలు పంపిణి జరిగింది.




5, మే 2020, మంగళవారం

COVID-19 అనంతర ప్రపంచం - నా అంచనాలు


1) Life Styles - కుటుంబ జీవనంలో గణనీయమైన మార్పు వస్తుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా Western countries లో కుటుంబ బంధాలు ఇప్పటివరకు బలహీనంగా ఉన్నాయి. లాక్ డౌన్ వల్ల , బ్రతుకు భయం వల్ల కుటుంబ సంబంధాల్లో అవగాహన పెరుగుతుందని, ఆత్మీయతలు తెలియకుండానే పెరుగుతాయని, ఇవి కుటుంబ వ్యవస్థ బలోపేతానికి దారి తీస్తాయని భావిస్తున్నాను.
ఆహారపు అలవాట్లలో కూడా గణనీయమైన మార్పు వస్తుందని, సొంతంగా ఆహారాన్ని తయారుచేసుకుని తినే అలవాటు పెరుగుతుందని నా నమ్మకం.
2) Medical & Health care - Western countries లో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా ప్రైవేట్ శక్తుల చేతుల్లో ఉంది. అందువల్లే COVID 19 ను ఎదుర్కోవడంలో అవి విఫలమయ్యాయి అని నేను భావిస్తున్నాను. అమెరికా లాంటి అత్యున్నత దేశంలో కేవలం 89,000 వెంటిలేటర్లు ఉండడం, PPE కిట్లు అందుబాటులో లేకపోవడం దుస్థితిని తెలియజేస్తోంది. భారత్ లాంటి దేశాలు అమెరికా కన్నా మెరుగ్గా COVID 19 ను ఎదుర్కో కలుగుతున్నాయి అంటే ఇక్కడ వున్న ప్రభుత్వ రంగంలోని హాస్పిటల్స్ కారణం. భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు COVID 19 వైద్యాన్ని మొత్తం ప్రభుత్వ రంగంలోనే చేయించడం వల్ల కేసులను అర్థం చేసుకోవడం, నియంత్రించడం సాధ్యమవుతోంది . అదే ప్రైవేటు రంగానికి వదిలి ఉంటే ఎక్కడ ఎన్ని కేసులు ఉన్నాయో, అది ఎంత స్ప్రైడ్ అవుతుందో, వైద్యం పేరిట వారెంత దోపిడీ చేస్తారో ఊహించుకుంటేనే భయమేస్తుంది. కనుక రానున్న రోజుల్లో ప్రభుత్వ రంగంలో వైద్య రంగాన్ని బలోపేతం చేసే విషయంలో అన్ని దేశాలు ముందడుగు వేస్తాయని భావిస్తున్నాను.
3) Personal & Community Hygiene - ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే Western countries లో నే COVID 19 ఎక్కువగా వ్యాపించింది. Personal hygiene తక్కువగా ఉండి ఎక్కువగా మురికితో సహవాసం చేసే మనలాంటి దేశాల్లో ఉద్ధృతి కొంత తక్కువగానే ఉంది. దీనిని బట్టి మురికితో సహవాసం చేసేవారికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుందనేది అర్థమవుతుంది. అంతేకాకుండా మన దగ్గర మలేరియా, తట్టు లాంటి రోగాలు ఇప్పటికీ ఉండడం వల్ల మనం హైడ్రోక్లోరొక్విన్ మందులను, బీసీజీ టీకాలను ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు అవే మనలను రక్షిస్తున్నాయి అంటున్నారు.
మిగిలిన ప్రపంచం మలేరియా లను, తట్టు లాంటి రోగాలను జయించడం వల్ల వారికి hydroxychloroquine, bcg లు అందుబాటులో లేకుండా పోయాయి. కాబట్టి personal hygiene ను ఎక్కువగా పెంచుకున్నా ఇబ్బందేనేమో ఆలోచించాలి.
4) Travel & Hospitality - ఇది బాగా తగ్గవచ్చు. వివిధ దేశాలు తమ దేశంలో ప్రవేశించే వారిపట్ల కఠిన నిబంధనలు అమలు చేయవచ్చు. అలాగే ప్రజలు కూడా కొంతకాలం టూరిజం పై ఆసక్తి కన బరచక పోవచ్చు. ఈ రంగం ఎక్కువగా కుదుపులకు గురయ్యే అవకాశం ఉంది.
COVID19 లాక్ డౌన్ వల్ల పర్యావరణ కాలుష్యం విపరీతంగా తగ్గింది. వ్యక్తిగత వాహనాలు మూలనపడ్డాయి. వాటిని అలాగే మూలన ఉంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచడం మంచిది. తద్వారా ప్రపంచాన్ని కాలుష్య రహితంగా మార్చుకోవడానికి అది ఉపకరిస్తుంది. అంతే తప్ప డ్రైవర్ లెస్ వాహనాలను పెంచితే భవిష్యత్తు కాలుష్యంతో మరింత బాధాకరంగా మారుతుంది.
గ్లోబలైజేషన్ కు దూరంగా ఉన్న ఉత్తర కొరియా(ఆంక్షల వల్ల), తుర్కమిస్తాన్, కొన్ని ఆఫ్రికా దేశాలు COVID 19 కు దూరంగా ఉన్నాయి. మిగిలిన ప్రపంచంతో అనుసంధానం లేకపోవడం వాటిని ఈ విషయంలో రక్షించినట్లు ఉంది.
5)Focus on Agriculture & Infrastructure - ఇది అత్యంత అవసరం. గ్లోబలైజేషన్ పేరిట వ్యవసాయ రంగాన్ని విస్మరించారు. అలాగే Infrastructure ను కూడా విస్మ రించారు. వెనకబడిన దేశాలనుంచి ముడి పదార్థాలను దిగుమతి చేసుకున్న అభివృద్ధి చెందిన దేశాలు తమ దగ్గర వస్తువులను తామర తంపరగా ఉత్పత్తి చేసి ప్రపంచమంతా వెదజల్లిన ఫలితంగా మన దేశం లాంటి దేశాలలో కనీసం ఆడవాళ్ళు తలలో పెట్టుకునే పిన్నీసులు సైతం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే ఆహార పదార్థాల విషయంలో కూడా అనేక దేశాలు దిగుమతుల మీద ఆధారపడ్డాయి. అలాంటి దేశాలన్నీ లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.మహాత్మా గాంధీ స్వయం పోషక గ్రామాలు ఉండాలని కోరుకున్నాడు. ప్రతి గ్రామం యొక్క అవసరాలు అన్ని ఆ గ్రామంలోనే తీరాలి అనేది ఆయన కోరిక. ఈ సూత్రాన్ని ప్రస్తుతం అన్ని దేశాలు అనుసరించడం మంచిది. ప్రతి దేశము తమకు అవసరమైన ఆహారాన్ని, వస్తువులను, ఇంధనాలని, ప్రతి దాన్ని సమకూర్చుకొని స్వయం సమృద్ధం అవడం మంచిది.
6)Low Cost Living - ఇది అనివార్యం. ఇప్పటికే రెండు నెలలు లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలు స్తంభించి ఆర్థిక చలనం ఆగిపోయింది. నూటికి ఎనభై శాతం మందికి పైగా జీతం లేకపోవడమో లేదా జీతంలో కోత పడడమో జరిగాయి. గ్లోబలైజేషన్ పుణ్యం వల్ల వస్తు సంస్కృతి, విలాస సంస్కృతి పెరిగి అందరూ EMI లకు అలవాటు పడ్డారు. ఇప్పుడు వాటిని చెల్లించడమే పెద్ద భారం. భారత్ లో కొంత పొదుపు అలవాటు ఉంది. యూరప్ దేశాలలో పొదుపు అలవాటు లేని కారణంగా ఉన్న సొమ్ము తో రెండు నెలలకు మించి బతకలేని దుస్థితి ఉంది. రానున్న సంవత్సరం లేదా ఆపైన ఆర్థిక మాంద్యం కొనసాగక తప్పదు. అందువల్ల జీతాలలో పెరుగుదల 80 శాతం మందికి అసాధ్యమనే చెప్పాలి. కనుక తక్కువ ఖర్చుతో జీవితాన్ని సాగించడం అలవాటు చేసుకుని తీరాలి.
7) China will emerge as Top Country - నా అంచనా ప్రకారం రానున్న రోజుల్లో చైనా ప్రపంచం అగ్రరాజ్యంగా భాసిల్లవచ్చు. COVID19 విషయంలో చైనాను దోషిగా నిలబెట్టాలని మిగిలిన ప్రపంచం ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవచ్చు. ప్రపంచం మొత్తం ఉన్న 200కు పైగా దేశాల్లో దాదాపుగా 80 దేశాలు ఇస్లామిక్ దేశాలు. అలాగే ఆఫ్రికా దేశాలు కూడా గణనీయంగా ఉన్నాయి. ఇస్లామిక్ దేశాలు అమెరికా, దాని అనుబంధ దేశాలకు వ్యతిరేకం కనుక, ఆర్థికంగా, సాంకేతికంగా బలంగా ఉండి వివిధ అంశాలలో తమకు సహకరించే చైనాకు అవి బాసటగా నిలవవచ్చు. ఇక అనేక ఆఫ్రికా దేశాలతో చైనా ఇప్పటికే ఆర్థిక, సాంకేతిక బంధాలను కలిగి ఉంది. పేదరికాన్ని అధిగమించడం కోసం ఆదేశాలు కూడా చైనాకు సహకరించవచ్చు. భారత్ చుట్టూ ఉన్న శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్ లాంటి దేశాలు ఇప్పటికే చైనాతో సత్ సంబంధాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఏ కోణం నుంచి చూసినా చైనా అతి సమీప కాలంలోనే ప్రపంచపు అగ్రరాజ్యంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. చైనాతో వైరం ఉన్న జపాన్, దక్షిణ కొరియా,భారత్ లాంటి దేశాలు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు చైనా వ్యతిరేక కూటమిగా ఉండవచ్చు. రష్యా, జర్మనీ వంటి దేశాలతో పాటు మాజీ సోవియట్ యూనియన్ నుంచి విడివడిన దేశాలు తటస్థ వైఖరి అవలంబించవచ్చు.
8) Is India grab the opportunity? - చాలా మంది ఆశావహులు, ముఖ్యంగా ఒక సెక్షన్ మద్దతుదారులు ఈ pandamic ముగిసిన అనంతరం భారత్ వెలిగి పోతుందని ఇప్పటి నుంచే ఊదర గొడుతున్నారు. అనేక ప్రపంచ దేశాలు చైనా నుంచి తమ ఫ్యాక్టరీలను, ఉత్పత్తులను ఉపసంహరిస్తాయనీ, వాటన్నింటినీ భారత్ కు తరలిస్తారని భావిస్తున్నారు. కొంతమేరకు ఇది జరగవచ్చు. అయితే ఒకప్పుడు సాంకేతికంగా వెలుగొందిన జపాన్, ఇప్పుడు సాంకేతికతలో ముందున్న దక్షిణ కొరియా, ఆ తర్వాత వియత్నాం, తైవాన్ లాంటి దేశాలు ఎక్కువగా లబ్ధి పొందవచ్చు. భారత్ లో మానవ వనరులు అధికంగా ఉన్నా పెద్ద ప్రతికూలత ఏమంటే ఇటీవల సమాజంలో అసహనం పెరగడం. అధికార స్థానంలో ఉన్న వాళ్ళు వాస్తవికత లో కన్నా వాగాడంబరం లో జీవించడం. దేశంలో ఫెడరల్ స్ఫూర్తి కి విఘాతం కలిగించే నిర్ణయాలను, చట్టాలను అమలుపరచడం. వీటన్నింటి వల్ల పొందాల్సిన మేరకు మన దేశం లబ్ధిని పొందలేక పోవచ్చు. అయితే ఇప్పుడున్న దానికన్నా కొంత లాభం జరగ వచ్చు. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలు తమ దేశాలలోకి ఇతరుల ప్రవేశంపై ఆంక్షలు పెంచనున్న కారణంగా భారత్ లోని software పరిశ్రమ పెరిగే అవకాశం వున్నది. ఇక్కడి నుండే సేవలను ఆయా దేశాలు పొందే అవకాశం గణనీయంగా పెరగవచ్చు.ఇతర రంగాలలో చెప్పుకోదగిన అభివృద్ధి ఉండకపోవచ్చు. కారణం మనదేశంలో ఉన్న పెట్టుబడిదారులలో అధిక శాతం దళారీలుగా వ్యవహరించే ధోరణి ఉన్నవారు. ఎంత ఎక్కువగా బ్యాంకులను, ఇతరులను ముంచాలనే ధోరణి ఉన్నవారు. వారికి మన ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థ కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తూ ఉంటుంది. కనుక ఇతర రంగాల్లో అభివృద్ధి కష్టమే. Software లో పెట్టుబడి తక్కువ ఫలితం ఎక్కువ. కనుక అది విజయవంతం అయ్యే అవకాశం ఉంది.
కొన్ని అంశాలలో ఇవి నా అంచనాలు మాత్రమే.
- టి.వి.రావు

కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా తిండిలేని వారిని అదుకుందాం....

హైదరాబాద్‌ జిందాబాద్‌ బాగ్‌లింగంపల్లి కమిటి ఆధ్వర్యంలో ఈ రోజు ఎల్‌ఐజి కాలనీ లో హైదరాబాద్‌ జిందాబాద్‌ కార్యాలయం వద్ద జరిగిన బియ్యం, సరుకుల పంపిణి కార్యక్రమము జరిగింది.  ముఖ్య అతిథులుగా ఎఎస్‌వో బాల్‌రాజు గారు, మరియు హైదరాబాద్‌ జిందాబాద్‌ నాయకులు శ్రీనివాస్‌ రావు గారు, సరుకుల దాత వి. రాజు గారు హాజరై ప్రారంభించారు. 
ఈ కార్యక్రమంలో 50 మంది కుటుంబలకు బియ్యం, సరుకుల పంపిణిి చేశారు. 




3, మే 2020, ఆదివారం

214 మందికి బియ్యం, సరుకుల పంపిణి...

ఆకలితో వందల మంది చనిపోతున్నారు.
వలస కూలీలను, తిండిలేని వారిని ఆదుకుందాం...

చాలా మంది ఎన్నోసార్లు నిరుపేదలకు కాస్తయినా సాయం చేద్దామనుకుంటారు.
 కానీ జీవన గమనంలో సమయం దొరకదు. అభాగ్యులకు అండగా నిలుద్దామన్న
 ఆశ వుంటుంది కానీ డబ్బులు వుండవు. దానికోసం సంపన్నులు, 
కోటీశ్వరులు కానక్కర లేదు. చదువు, హోదాలతో పనిలేదు. 
మంచితనం, మానవత్వం వుంటే చాలు...

1, మే 2020, శుక్రవారం

పారిశుధ్య ఉద్యోగులకు మే డే శుభాకాంక్షలు...

కరోనా మహమ్మారి పై పోరు చేస్తున్న పారిశుధ్య ఉద్యోగులకు
వైద్య సిబ్బందికి, శ్రామిక వర్గానికి వందనాలు...
మే డే శుభాకాంక్షలు. 

... హైదరాబాద్‌ జిందాబాద్