30, ఏప్రిల్ 2020, గురువారం

ఓల్డ్‌ నల్లకుంట వీది నంబర్ 14 లో...బియ్యం, సరుకుల పంపిణి..

వలస కూలీలను, తిండిలేని వారిని అదుకుందాం.... హైదరాబాద్‌ జిందాబాద్‌
27.04.2020 ఓల్డ్‌ నల్లకుంట వీది నంబర్ 14 లో జరిగిన బియ్యం, 10 రకాల సరుకుల పంపిణి... 

25 మంది కుటుంబలకు పంపిణి చేశాము.








26, ఏప్రిల్ 2020, ఆదివారం

ఫీవర్‌ హాస్పిటల్‌ చౌరస్తాలో బియ్యం, 10 రకాల సరుకుల పంపిణి ...

వలస కూలీలను, తిండిలేని వారిని అదుకుందాం.... హైదరాబాద్‌ జిందాబాద్‌
ఈ రోజు ఫీవర్‌ హాస్పిటల్‌ చౌరస్తాలో ( ఓల్డ్‌ నల్లకుంట ) జరిగిన బియ్యం, 
10 రకాల సరుకుల పంపిణి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్లకుంట సిఐ 
మూరళిధర్‌ గారు, ఎస్‌ఐ వీరశేఖర్‌ గారు హాజరై ప్రారంభించారు.
ఈ రోజు ఉత్తరప్రదేశ్‌ చెందిన 27 మంది కుటుంబలకు పంపిణి చేశాము.


బియ్యం5 కెేజీలు, కందిపప్పు1కెేజీ, విజయా నూనె1కేజీ, షుగర్‌ 500 గ్రా.,
చింతపండు 250 గ్రా...మొదలగు 10 రకాల వస్తువులతో కూడిన ప్యాక్‌లు పంపిణి చేయడం జరిగింది.





22, ఏప్రిల్ 2020, బుధవారం

ఓల్డ్‌ నల్లకుంట లో బియ్యం, సరుకుల పంపిణి...

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో ఓల్డ్‌ నల్లకుంట లోని ఓల్డ్‌ రామాలయం వద్ద జరిగిన బియ్యం, సరుకుల పంపిణి కార్యక్రమానికి జిహెచ్‌ఎంసి డిఫ్యూటి కమీషనర్‌ వేెణుగోపాల్‌ గారు ముఖ్య అతిథిగా హాజరైనారు.
వలస కార్మికులు,ఇంటి పనివారు, చెత్తబండి వారు,వాచ్ మెన్ లకు బియ్యం5 కెేజీలు, కందిపప్పు1కెేజీ, విజయా నూనె1కేజీ, షుగర్‌ 500 గ్రా.,చింతపండు 250 గ్రా...మొదలగు 10 రకాల వస్తువులతో కూడిన ప్యాక్‌లు పంపిణి చేయడం జరిగింది. ఈ రోజు మొత్తం 32 మందికి పంపిణి చేశాము.




18, ఏప్రిల్ 2020, శనివారం

వలస కార్మికులకు బియ్యం సరుకుల పంపిణి...

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో అంబర్‌పేట్‌ 6 నెంబర్‌ చౌరస్తాలో జరిగిన బియ్యం సరుకుల పంపిణి కార్యక్రమానికి జిహెచ్‌ఎంసి డిఫ్యూటి కమీషనర్‌ వేెణుగోపాల్‌ గారు ముఖ్య అతిథిగా హాజరైనారు.
ఉత్తరప్రదేశ్‌, కర్నాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌ , మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల వలస కార్మికులకు బియ్యం5 కెేజీలు, కందిపప్పు1కెేజీ, విజయా నూనె1కేజీ, షుగర్‌ 500 గ్రా.,చింతపండు 250 గ్రా...మొదలగు 10 రకాల వస్తువులతో కూడిన ప్యాక్‌లు పంపిణి చేయడం జరిగింది. ఈ రోజు మొత్తం 7 ఫ్యామిలీలకు, 42 మంది బ్యాచ్‌లర్స్‌కు ప్యాకెట్స్‌ పంపిణి చేశాము.



13, ఏప్రిల్ 2020, సోమవారం

తిండిలేక చాలా ఇబ్బందులు పడుతున్నవలస కార్మికులకు చేయుత ..

మొదటి ఫెస్‌ పంపిణి ...12.04.2020
తిండిలేక చాలా ఇబ్బందులు పడుతున్న ఛత్తీస్‌ఘడ్‌, బీహర్‌, ఒరిస్సా, మహారాష్ట్ర, జార్‌ఖండ్‌ మరియు తెలుగు రాష్ట్రాల వలస కార్మికులకు  హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో బియ్యం5 కెేజీలు, కందిపప్పు1కెేజీ, విజయా నూనె1కేజీ, షుగర్‌ 500 గ్రా.,చింతపండు 250 గ్రా...మొదలగు 10 రకాల వస్తువులతో కూడిన ప్యాక్‌లు పంపిణి చేయడం జరిగింది.


కరోనాతో తెలంగాణ గతనెల 23 నుంచి ఈనెల 14 వరకు, గతనెల 24 నుంచి భారతదేశం మొత్తం లాక్‌డౌన్‌ అయ్యినప్పటి నుండి కార్మికుల కష్లాలు బాగా పెరిగిపోయాయి. ఇక్కడ పని లేక, ఇతర రాష్ట్రాల వారు, ఇతర జిల్లాల వారు సొంత ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో వుండిపోయి తిండిలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ లాంటి వారికి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి గాని, ఇతరుల నుండి గాని ఏలాంటి సహకారం అందడం లేదు. మేము అటువంటి వారిని హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో సర్వే చేసి కొంత మందిని గుర్తించి, వారికి సహకారం అందింస్తున్నాము. 
బీయ్యం, కంది పప్పు, నూనె ... ప్యాకెట్స్‌ పంపిణి కార్యక్రమంలో వీరయ్య, పి. శ్రీనివాస్‌రావు, డి. మోహన్‌, సిహెచ్‌ రమణ, ఉత్తమ్‌ తదితరులు పాల్గొన్నారు. పాత నల్లకుంటలో ఏరియా కమిటి ఆధ్వర్యంలో స్థానిక ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించాము. అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన వారికి ధన్యవాదాలు.

డిడి కాలనీలో హహోబిలం టెంపుల్‌ దగ్గరలో కన్‌స్ట్రక్షన్‌ అగిపోయిన 
నాలుగు అపార్ట్‌మెంట్స్‌లో వలస కార్మికులకు ఈ రోజు 
మొత్తం 15 ఫ్యామిలీలకు, 28 మంది బ్యాచ్‌లర్స్‌కు ప్యాకెట్స్‌ పంపిణి చేశాము.
వారి లిస్టు : 
ఛత్తీస్‌ఘడ్‌ 6 ఫ్యామిలీలు,4 బ్యాచ్‌లర్స్‌  బీహర్‌ 4 బ్యాచ్‌లర్స్‌ , ఒరిస్సా 2 బ్యాచ్‌లర్స్‌ , మహారాష్ట్ర 1 ఫ్యామిలీ , జార్‌ఖండ్‌ 6 బ్యాచ్‌లర్స్‌,  రాజస్థన్‌ 1 బ్యాచ్‌లర్‌  నెల్లూరు 2 ఫ్యామిలీలు,6 బ్యాచ్‌లర్స్‌  ప్రకాశం 2  మిలీలు, శ్రీకాకుళం 5 బ్యాచ్‌లర్స్‌  జనగాం 3 ఫ్యామిలీలు మహబూబబాద్‌1 ఫ్యామిలీ







7, ఏప్రిల్ 2020, మంగళవారం

ప్రజా ఆరోగ్యమే మొద్దటి ఎజెండా...

ప్రపంచ మానవాళిని గజగజ వణికిస్తూన్న బయంకర మహామ్మారి కరోనా.
ఇప్పటికే దాదాపు 75 వేల మందిని పోట్టన పెట్టుకోగా, దాదాపు 13.5 లక్షల మంది బారిన పడ్డారు.
 కరోనాపై ప్రపంచమే యుద్దం చేస్తున్న తరుణంలో ప్రపంచ చరిత్రలో నేడు ముఖ్యమైన రోజు. 
నేడు 07.04.2020 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. చాలా విశిష్టిత కలిగినది. వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ద్య కార్మికులు, శాస్త్రవేత్తలు కరోనాపై చేస్తూన్న పోరాటంలో నిజమైన దేవుళ్ళు. మానవత్వం ముందు మరేది నిలవలేక పోయింది. గెలువలేక పోయింది. ఇది ఎన్నో చరిత్రలు చెప్పిన సత్యం.

ఇపుడు మనుషులు జీవించాలంటే ఏమి చేయాలి? ఏమి నేర్చుకోవాలి ?
ప్రకృతి పట్ల, తోటి జీవరాశుల పట్ల ప్రవర్తన ఏలా వుండాలి ?
భవిష్యత్‌ కోసం ప్రభుత్వాలు ఏమి ఆలోచిస్తున్నాయి ?
రాజకీయ నాయకులు ఏం చేపుతున్నారు ?
శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఏమి స్పందిస్తున్నారు ?
ఇలా ప్రజల ముందు భవిష్యత్‌ గురించి ఆలోచిస్తే ఎన్నో ప్రశ్నలు...?

కరోనా లాంటి మహామ్మారులకు ధనిక, పేద, కులం, మతం, తక్కువ,
ఎక్కువ, ఈ దేశం, ఆదేశం...అనే భావం లేకుండా భూమిపై జీవించే
జీవరాసులన్నింటిని సమానంగా చూస్తాయి. ప్రస్తూత పరిస్థితులను చూసి అయిన భవిష్యత్‌లో ప్రజా ఆరోగ్యం ప్రపంచ దేశాల మొద్దటి ఎజెండా గా వుండాలి. ఆరోగ్యంపై అన్ని దేశాలు పర్సపర సహకరాలు ఇచ్చిపుచ్చుకునే విదంగా వుండాలి. ఇపుడు వున్న లోపాలను సవరించుకోని ముందుకు వెళ్ళాలి. ఇలాంటి మహామ్మారులపై నిత్యం శాస్త్ర సాంకేతిక, విజ్ఞాన పరిశోధనలు చేయడంలో గణనీయంగా పెరగాలి. ప్రభుత్వాలే ఆరోగ్య ఆసుపత్రులను నెలకొల్పి, అభివృద్ది చేయాలి. వైద్యులను, వైద్య సిబ్బందిని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా పెంచుకోవాలి. అభివృద్ది చేసుకోవాలి. ఈ లాంటి మహామ్మారులు ఏన్ని వచ్చిన యుద్దానికి స్థిదంగా వుండాలి. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ పర్యావరణానికి నష్టం కలిగించకుండా ప్రకృతిలో కలిసి జీవించాలి.