28, ఆగస్టు 2011, ఆదివారం

ఇది ప్రజా విజయం...అన్నా దీక్ష విరమణ...

అన్నా దీక్ష విరమణ...
ఇది ప్రజా విజయం... అహింసా ఉద్యమ స్ఫూర్తి కొనసాగిద్దాం - అన్నా హజారే
   పండుగ వాతావరణం నెలకొన్న రాంలీలా మైదానంలో, ఆనంద ఉత్సాహాలతో పరుగులు తీస్తూ వచ్చిన వేలాది ప్రజాస్వామిక ప్రేమికుల సమక్షంలో  అన్నా హజారే ఆదివారం ఉదయం 12 రోజుల దీక్ష విరమించారు. ఐదేళ్ల చిన్నారులు సిమ్రన్, ఇక్రా కొబ్బరినీళ్లు ఇవ్వడంతో అన్నా దీక్ష విరమించారు. అనంతరం అహింసా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దామని అన్నా ప్రజలకు పిలుపునిచ్చారు.   

    పౌర సమాజం చేసిన డిమాండ్లలను ఎట్టకేలకు పార్లమెంటు ఆమోదించడం ప్రజా ఘన విజయమని అన్నా వ్యాఖ్యానించారు. దీక్ష విరమించిన అనంతరం ఆయన అశేష జన సందోహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారత్ త్వరలోనే అవినీతి రహిత దేశంగా మారగలదని ఉత్సాహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సాధించినది సగం విజయమేనంటూ దేశ ఎన్నికల నిర్వహణ వ్యవస్థలోనూ, విద్యారంగ వ్యవస్థలోనూ ఎన్నో సంస్కరణలు రావల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు. అన్నా ఉద్యమం ఇంతటితో ఆగిపోయేది కాదంటూ అవినీతిపరులైన ప్రజా ప్రతినిధులను చట్ట సభలనుంచి వెనుకకు తీసుకురావాలని అన్నారు. విద్యా రంగం ధనార్జనకు వేదికగా మారిపోయిందని అందువల్ల విద్యా వవస్థలో ఎన్నో సంస్కరణలు రావాల్సి ఉందని అన్నా పిలుపునిచ్చారు.

      దీక్ష విరమించిన అనంతరం అన్నాను చికిత్స కోసం తిన్నగా మేధాంత మెడిసిటీకి తీసుకువెళ్లారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద సంబరాలు చేసుకుందాం రమ్మని ప్రజలకు కేజ్రీ వాల్ పిలుపునిచ్చారు. 

(  ఆంధ్రజ్యోతి ,ఈనాడు పత్రిక సౌజన్యం తో...  )

27, ఆగస్టు 2011, శనివారం

26, ఆగస్టు 2011, శుక్రవారం

మనిషి రూపంలోని దైవస్వరూపం...

మనిషి రూపంలోని దైవస్వరూపం
        -మదర్‌ థెరిస్సా
ప్రేమ, కరుణ, జాలికి ప్రతిరూపం మదర్‌ థెరెస్సా. ఆమె నిరుపేదలను, గూడులేని అభాగ్యులను, అనాథలను, వికలాంగులను, వ్యాధిగ్రస్తులను, దిక్కులేని అనాథలను అక్కున చేర్చుకుంది. వారికి ఆశ్రయం కల్పించి, వారు తలదాచుకోవడానికో గూడును ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక అనాధాశ్రమాలను స్థాపించిన మదర్‌, ఎక్కువగా కలకత్తాలోని మురికివాడలలో పేదల కోసం పని చేసింది. తన జీవితాన్ని ఇతరులకు అంకితం చేసిన మదర్‌ థెరెస్సా... ప్రపంచవ్యాప్తంగా ప్రేమకు, కరుణకు, ఆత్మస్థైర్యానికి, నమ్మకానికి పర్యాయపదంగా నిలిచిపోయింది.

           ఒంటరిగానే ఆశయసిద్ధి కోసం ప్రయత్నం ప్రారంభించి, వేలాదిమందిని తనతో కలుపుకుని, తన మార్గంలో నడిచేలా చేసింది ఆ మహనీయురాలు. మదర్‌ థెరెసా మొదటి పేరు ఆగెస్‌ గోన్‌జా బోజాషు. అందరు  ప్రేమగా పిలుచుకునే 'మదర్‌ థెరిసా'!


20, ఆగస్టు 2011, శనివారం

వర్షం వస్తే హైదరాబాదు ఇంతేనా ....

హైదరాబాదులో భారీ వర్షం కురిసితే పరిస్తితి ఇంతేనా.... ఇంకా బాగుపడదా...  ఇంకా ఎంతా కాలం... ప్రజలు నరకం అనుభవించల్సిదేనా... విముక్తి లేదా...  
       రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాదులోని రోడ్లు పూర్తిగా జలమయం అయ్యాయి. చాలా చోట్ల మోకాళ్ల లోతు నీరు చేరుకుంది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కిలొమీటర్ల కొద్ది వాహనాలు నిలవడంతో ట్రాఫిక్ స్తంభించింది.  బస్టాప్ ప్రాంతంలో రోడ్డు పై నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని ప్రాంతాలలో నీరు ఎక్కవ మొత్తంలో రోడ్లపై నిలవడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు వర్షపు నీటిలో మునిగి ముందుకు సాగకుండా మెరాయించాయి. దీంతో  ట్రాఫిక్ భారీగా  స్తంభించింది.   కొన్ని రోడ్ల పై  గంటల సేపు నీరు ఎక్కువ మొత్తంలో నిలిచింది. దానితో రాకపోకలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది.   అనేక ప్రాంతాలలో  భారీ వర్షానికి పలు ఇళ్ళల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.    

              రాష్ట్రంలోని తెలంగాణ నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 24 గంటల వరకు భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి.  

19, ఆగస్టు 2011, శుక్రవారం

ప్రపంచ ఫోటోగ్రఫీ దీనోత్సవ శుభాకాంక్షలు...

ఫోటోగ్రఫీ  మీత్రురులందరికి   
నేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దీనోత్సవ శుభాకాంక్షలు


 







ఫ్రెంచ్ పరిశోధకుడు నేసెఫార్ నిప్సే 1886 లో తీసిన చాయా చిత్రం ప్రపంచములోనే మొట్టమొదటిగా గుర్తింపబడింది గా సమాచరం.  






 

మొదటి తరం డబ్బా ఫోటో కెమెరా

17, ఆగస్టు 2011, బుధవారం

అన్నాకు మద్దతుగా భారత్ భగ్గుమన్నది...

అన్నా హజారే అరెస్టుతో మంగళవారం భగ్గుమన్న భారతావని ఈరోజు కూడా నిరసనలకు దిగింది .  దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగిన్నాయి. బుధవారం సాయంత్రం ఇండియా గేట్‌ నుంచి పార్లమెంటు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. తాను దీక్ష చేయడానికి బేషరతుగా అనుమతి ఇస్తేనేగానీ జైలు నుంచి కదలనని తేల్చి చెప్పిన హజారే తన పట్టు వీడడం లేదు. హజారే ఇంకా తీహార్‌ జైలులోనే ఉన్నారు.

             అవినీతికి వ్యతిరేకంగా జన్‌ లోక్‌పాల్‌ బిల్లు తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న అన్నా హజారే, ఆయన అనుచరులను అరెస్టు చేయడాన్ని అందరు ఖండించాలి.  అవినీతిపై విపక్షాలు, వివిధ సంస్థలు చేస్తున్న ఆందోళనలపై కేంద్రం దాడి చేయడంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరేమిటో స్పష్టమవుతోంది . ఇప్పటికైనా ప్రతిపక్షాల, ప్రజల విజ్ఞప్తుల మేరకు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన జన్‌ లోక్‌పాల్‌ బిల్లును రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టాలి.