29, ఏప్రిల్ 2019, సోమవారం

నడి వయసులో ధీమాగా ఉండాలంటే బీమా అవసరం...

ఈ వయసులో ఆర్థికంగా స్థిరత్వం సాధించి ఉంటారు. మరికొందరు ఇప్పుడిప్పుడే తమ భవిష్యత్ ప్రణాళికలను వేసుకుంటారు... ఉద్యోగంలో చేరిన కొత్తలో బీమా పాలసీలు వేరు, నడి వయసులో బీమా పాలసీలు వేరు... ఇప్పుడు అన్ని రకాలుగా బాధ్యతలు పెరిగి ఉంటాయి. అందుకు అనుగుణంగా ఇప్పుడు బీమా పాలసీలు ఆలోచించాలి...

27, ఏప్రిల్ 2019, శనివారం

తెలంగాణ లోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు...

 తెలంగాణ లోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు...
 మే 6 మొదటి విడతలో , మే 10 రెండో విడతలో , మే 14 మూడో విడతలో  ఓటింగ్‌ జరగనుంది. 



24, ఏప్రిల్ 2019, బుధవారం

చేతులెత్తేసారా?...

- ఇంటర్‌లో అవకతవకలపై ప్రభుత్వానికి హైకోర్టు చురకలు
- యంత్రాంగం లేదని బాధ్యతల నుండి తప్పుకోవద్దు
- మీనమేషాలు లెక్కించకుండా తల్లిదండ్రుల కోణంలో ఆలోచించండి
- ముగ్గురు సభ్యులతో కమిటీ వేస్తే న్యాయం జరగదు
- లెక్కల్లో 60 మార్కులొచ్చిన విద్యార్థికి ఊరట లభిస్తుందా?
- సమస్య పరిష్కారంపై 29లోగా చెప్పాలని ఆదేశం
ఇంటర్మీడియట్‌ పరీక్ష పేపర్లను సరిగ్గా వాల్యుయేషన్‌ చేయకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రుల కుటుంబాలకు రూ.50 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.అచ్యుతరావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం అత్యవసరంగా భోజన విరామ సమయంలో విచారించాలని కోరారు. దీనిని మంగళవారం హైకోర్టు తాత్కాలిక ప్య్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ పిల్‌ను విచారించింది. మూడు లక్షల మంది విద్యార్థులు పరీక్ష తప్పారు. వీరి సమస్యను ఎలా పరిష్కరిస్తారో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌, రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డిలు 29న జరిగే విచారణ సమయంలో చెప్పాలి. 



18, ఏప్రిల్ 2019, గురువారం

విద్వేష వ్యాఖ్యలు చేసిన నేతలపై నిషేధం...

యోగి ఆదిత్యనాథ్ పై మూడు రోజులు,
అజమ్ ఖాన్ పై మూడు రోజులు,
మేనకా గాంధీ పై రెండు రోజులు,
మాయావతి పై రెండు రోజులు నిషేధం సుప్రీం కోర్టు ప్రకటించింది.

17, ఏప్రిల్ 2019, బుధవారం

పార్లమెంటు సభ్యుల విద్యార్హతలు...

మొదటి లోక్ సభ నుండి 16వ లోక్ సభ వరకు సభ్యుల వివరాలు....
నరేంద్ర మోడీ, స్మృతి ఇరానీ, రాహుల్ గాంధీ.....పార్లమెంట్ సభ్యుల విద్యార్హతల పై దేశంలో అనేక చర్చలు   జరుగుతున్నాయి.  


13, ఏప్రిల్ 2019, శనివారం

రాష్ట్రంలో పోలింగ్‌ 62.69%...

- 2019 లోక్‌సభ ఎన్నికల తుది ఓటింగ్‌ వివరాల ప్రకటన
- ఖమ్మంలో అత్యధికంగా 75.28%, 
- హైదరాబాద్‌లో అతితక్కువగా 44.75% నమోదు
- గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 8.06 శాతం తగ్గుదల
   2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 62.69 శాతం పోలింగ్‌ నమోదైంది. 17 లోక్‌సభ నియోజకవర్గాలకు గురువారం జరిగిన పోలింగ్‌ తుది వివరాలను రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ప్రకటించింది. దీని ప్రకారం అత్యధికంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో 75.28 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా హైదరాబాద్‌ పార్లమెంటు సెగ్మెంట్‌లో 44.75 శాతం మంది ఓటేశారు. పూర్తిగా పట్టణ ప్రాంత సెగ్మెంట్లైన మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్‌ నియోజకవర్గాల్లో తక్కువ ఓటింగ్‌ నమోదైంది.

    2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 70.75 శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికల పోలింగ్‌ గణాంకాలతో పరిశీలిస్తే ఈసారి ఎన్నికల్లో ఏకంగా 8.06 శాతం మేర పోలింగ్‌ తగ్గడం గమనార్హం. 2014లో రాష్ట్రంలో ఒకేసారి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో గడువు ముగియకముందే శాసనసభ రద్దు కావడంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో గతేడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 76.07 శాతం ఓటింగ్‌ జరిగింది. 




11, ఏప్రిల్ 2019, గురువారం

ప్రభుత్వం మేల్కొనకపోతే మంచినీటికి ముప్పు ...

నూరేండ్ల క్రితం హైదరాబాద్‌ చెరువులతో సుందరంగా ఉండేది. హైకోర్టు సైతం మూసీ నదీ ప్రవాహపు ఒడ్డున ఉండేది. ఇప్పుడు చెరువులు మాయమయ్యాయి. మూసీ మురికి కూపంగా మారిపోయింది. ప్రభుత్వం మేల్కొనకపోతే మంచినీటికి ముప్పు ఏర్పడే ప్రమాదమున్నది. ఇప్పటికే బెంగళూరు నగరం, రాజస్థాన్‌ రాష్ట్రంలో నీటి కోసం జనం అల్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే కాకుండా ప్రజలు సైతం మూసీ నదిని కాపాడేందుకు, చెరువుల్ని రక్షించేందుకు చిత్తశుద్ధితో నడుం బిగించాలి..' అని హైకోర్టు అభిప్రాయపడింది.


9, ఏప్రిల్ 2019, మంగళవారం

ఒక్కటి కాదు.. ఐదు లెక్కించాల్సిందే... సుప్రీంకోర్టు

2019 సార్వత్రిక ఎన్నికలలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని యాభై శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలన్న విపక్షాల అభ్యర్థనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు వీవీప్యాట్‌ స్లిప్పులను, లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 35 వీవీప్యాట్లను ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లతో సరిపోల్చాలని ఈసీని ఆదేశించింది. ప్రతిపక్షాలు కోరినట్టుగా 50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.




8, ఏప్రిల్ 2019, సోమవారం

హ్యాట్రిక్ వీరులు...

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలలో హ్యాట్రిక్ వీరులు...
ఇప్పటివరకు కేవలం 13 మంది సాధించారు....
ఎన్నికలలో రోజురోజుకు పోటీ చేసే వారి సంఖ్య పెరుగుతున్నది