29, అక్టోబర్ 2019, మంగళవారం

చెట్ల నరికివేతను ఆపాలని...

బాగ్‌లింగంపల్లిలో సుందరయ్య పార్క్‌ దగ్గర ఎంఐజి-2, బ్లాక్‌ 18 వద్ద 
28.10.2019  35 సం||ల వయసు కలిగిన  వేప, రాగి మొదలగు చెట్లను నరికివేస్తున్న దృశ్యాలు... 
హరితహరం పేరుతో ప్రభుత్వం కోట్లాది మొక్కలను నటుతూ చెట్లు పెంచాలని,
పర్యావరణాన్ని కాపాడాలని కోరుతుంటే మరొక వైపు పుట్‌పాత్‌ రోడ్‌పై వున్న
చెట్లును ఏలా కొట్టివేస్తారు. 35 సం||ల పెద్ద చెట్లకు నరికి వేతకు జిహెచ్‌ఎంసి ,
అడవి శాఖ వారు ఏలా పర్మిషన్‌ ఇచ్చారు. ..                  
సంబంధిత అధికారులు స్పందించి నరికివేతను వెంటనే ఆపాలని,
చెట్లు కొట్టివేయించిన అధికారులపై ౖ తగిన చర్యలు తీసుకోవాలని 
'' హైదరాబాద్‌ జిందాబాద్‌'' డిమాండ్‌ చేస్తున్నది.





25, అక్టోబర్ 2019, శుక్రవారం

దీపాలతోనే దీపావళి...

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో నేడు ( 25-10-2019న) 
సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగర ' దీపాలతోనే దీపావళి జరుపుకుందాం -పర్యావరణాన్ని కాపాడుదాం' కార్యక్రమం జరిగింది. 
ప్రముఖ మ్యాజిక్ కళాకారుడు, కేంద్ర బాల సాహితీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకట రమణ గారు, ప్రముఖ మిమిక్రీ కళాకారులు కళారత్న మల్లం రమేష్ గారు, విద్యాధికారి స్వరాజ్ కుమార్ గారు తదితరులు పాల్గొన్నారు.