14, నవంబర్ 2014, శుక్రవారం

వన్డే చరిత్రలో రోహిత్ ప్రపంచ రికార్డు...


              భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ లంక బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. డబుల్ సెంచరీతో బ్రేక్ డాన్సు చేశాడు. సిక్స్‌లు, ఫోర్ల వర్షంతో లంక ఆటగాళ్లకు చుక్కులు చూపించాడు. ఈడెన్ గార్డెన్‌లో పరుగుల వర్షం కురిపించాడు. వన్డేల్లో ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు. భారత క్రీకెట్ అభిమానులకు పసందైన పరుగుల విందు ఇచ్చాడు. 9 సిక్స్‌లు, 33 ఫోర్లతో దుమ్మురేపాడు. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు కొట్టిన మొదటి బ్యాట్స్‌మన్‌గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. వన్డే చరిత్రలో అత్యధిక (264)స్కోరు చేసిన మొదటి ఆటగాడిగా చరిత్ర సష్టించాడు. 173 బంతుల్లో ఈ ఘనత సాధించాడు.

23, అక్టోబర్ 2014, గురువారం

'దీపావళి పండుగ' శుభాకాంక్షలు...

మీకు , మీ కుటుంబ సభ్యులందరికి నా హృదయపూర్వక 'దీపావళి పండుగ' శుభాకాంక్షలు...

9, అక్టోబర్ 2014, గురువారం

చే


నేటికీ ప్రపంచ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...చే  రూపం.

నీ రూపం
నీ పోరాట పటిమ
ప్రపంచ యువతరానికి   నేటికీ ఆదర్శం  
ప్రపంచంలో ఎకడచుసినా  నీ రూపం...
ఏ   కీ చైన్  చూసినా, టీ షార్ట్ చూసినా .....
మరో వైపు నీ రూపం శత్రువు గుండెల్లో నేటికీ దడపుట్టిస్తోంది...  

నువ్వందించిన స్ఫూర్తి
ఆచరణలో నీవు చూపిన తెగువ
నేటికీ యువత నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...


గిరిజన పోరాట యోధుడు కొమురం భీము...

               ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో 
బుధవారం కొమురం భీమ్ 74వ వర్ధంతి సభను (08.10.2014)
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు   ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

6, అక్టోబర్ 2014, సోమవారం

3, అక్టోబర్ 2014, శుక్రవారం

ద‌స‌రా(విజ‌య‌ద‌శ‌మి) పండ‌గ శుభాకాంక్ష‌లు...


ప్రియ‌మైన మిత్రులు, శ్రేయోభిలాషులకు ద‌స‌రా(విజ‌య‌ద‌శ‌మి) పండ‌గ శుభాకాంక్ష‌లు

22, సెప్టెంబర్ 2014, సోమవారం

కాలుష్యం నుండి రక్షించుకుందాం..

ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి.

హైదరాబాద్ ప్రజలారా మనం  అయీనా
హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుండి రక్షించుకుందాం.

2, సెప్టెంబర్ 2014, మంగళవారం

24 ఏళ్లకు టీమిండియా సిరీస్ కైవసం..

         
     భారత్ - ఇంగ్లండ్ ల నాల్గవ వన్డే మ్యాచ్ లో ఇంగ్లండ్ పై భారత్ ఘనవిజయం సాధించింది. 30.3 ఓవర్లు పూర్తయ్యే సరికి 212 పరుగులు చేసి భారత్ ఆటగాళ్లు క్రీడాకారులను అబ్బురపరిచారు. భారత్ ఆటగాళ్లు రహనే -106, ధావన్-97 *, కోహ్లీ -1 పరుగులు చేసారు.  
         టెస్టుల్లో ఘోరంగా ఓడిన  టీమిండియా.. వన్డే సిరీస్ లో విశేషంగా రాణించి ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ ను కైవసం చేసుకుంది. దీంతో 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా ఆటగాళ్లు సరికొత్త చరిత్రను లిఖించారు.  గత రెండు వన్డేల్లో ప్రదర్శించిన ఊపునే కొనసాగించిన టీమిండియా ఆటగాళ్లు.. అదే విజయపరంపరను కొనసాగించి సిరీస్ 3-0 తేడాతో చేజిక్కించుకున్నారు. 
          ఇంగ్లండ్ 49.3 ఓవర్లు పూర్తయ్యే సరికి 206 పరుగులు పూర్తి చేసి ఆలౌట్ అయ్యారు.  ఇంగ్లండ్ స్కోర్ వివరాలు: కుక్ -9, హెల్స్ -6, బల్లాన్స్-7, రూట్-44, మోర్గాన్ -32, బట్లర్-11, అలీ-67, వోక్స్-10, ఫిన్ -2, అండర్సన్-1, గర్నే -3 పరుగులు చేశారు.  
           భారత్ బౌలర్లు కుమార్ -2, షమీ -3, జడెజా -2,అశ్వీన్ , రైనా లు తలో వికెట్ తీసుకున్నారు.

30, ఆగస్టు 2014, శనివారం

మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించండి...


మీకు, మీకుటుంబ సభ్యులకూ వినాయకచవితి శుభాకాంక్షలు

ప్లాస్టాఫ్ పారీస్[రసాయన రంగులు]తో తయారు చేసిన 
వినాయక విగ్రహాలు నిమజ్జనం చెయ్యడం వల్ల
చెరువులు కలుషితమై...పర్యావరణ పరంగా 
దృష్ప్రభావాలు సంభవిస్తాయి.

మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించండి  

18, ఆగస్టు 2014, సోమవారం

మా జ్ఞాపకాలు...



ఆగస్టు 17
మా జీవితంలో ఒక ముఖ్యమైన దినం
మా కుటుంభనికి శుభ దినం 
అదే మా  పెళ్ళి రోజు  
ఈ సందర్భంగా  17.08.2014న దిగి ఫోటొలు.

11, ఆగస్టు 2014, సోమవారం

రక్షా బంధన్ శుభాకాంక్షలు...









రక్షా బంధన్ శుభాకాంక్షలు...

10.08.2014 న జరిగిన రాఖి పౌర్ణమి పండుగ రోజు
శుభాకాంక్షలు తేలియజేస్తూ రాఖిలు కట్టుతున్న ఫోటొలు.
ఈ రాఖి పౌర్ణమి సందర్భంగా కొన్ని మా జ్ఞాపకాలు.

29, జులై 2014, మంగళవారం

మిత్రులందరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు...


రంజాన్ పండుగ సందర్భంగా మిత్రులందరికి  నా హృదయ పూర్వకమైన శుభాకాంక్షలు...

13, జులై 2014, ఆదివారం