28, సెప్టెంబర్ 2013, శనివారం

దేశంకోసం తన ప్రాణాల్నివదిలిన విప్లవవీరుడు

భగత్‌సింగ్‌ 23 ఏళ్ళకే దేశ స్వాతంత్య్రం కోసం ఉరి కంభం ఎక్కిన త్యాగశీలురు. భగత్‌సింగ్‌ ఒక గొప్ప వీరుడుగా, సాహసిగా, ధైర్యవంతుడుగా బాగా సుపరిచితుడయ్యారు. 'ఇంక్విలాబ్‌-జిందాబాద్‌' అని వారు ఇచ్చిన నినాదం యావత్‌ జాతికి స్ఫూర్తిదాయకంగా మారి  సామ్రాజ్యవాదులను గడగడ లాడించాయి.

భగత్‌సింగ్‌ గొప్ప అధ్యయనశీలి, ఆలోచనాపరుడు. అందుకే విప్లవం, సోషలిజం, దేవుడు, మతం, టెర్రరిజం అనే విషయాలపై స్పష్టంగా తన అభిప్రాయాలను వివరించాడు. సెప్టెంబర్‌ 28న భగత్‌సింగ్‌ 107వ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా ఆయన భావాలను ప్రజల ముందుంచడం అవసరం. సమాజ సేవ, సామాజిక న్యాయం, దేశ సార్వభౌమాధికారం, జాతీయ సమైక్యత, సమగ్రత, మానవత్వం, మత సామరస్యం కోసం పాటుపడాలనే చైతన్యాన్ని యువతలో పెంపొందించాలి. 

27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఏడు ద్వీపాల సమూహం...


ఏడు ద్వీపాల సమూహం.. లక్నవరం సరసు
వరంగల్ నుంచి ములుగు వెళ్లే దారిలో లక్నవరం ఉంది. మూడు వైపులా కొండలు, మధ్యలో 10 వేల ఎకరాల్లో ఈ చెరువు విస్తరించి ఉంది. ఏడు చిన్నచిన్న ద్వీపాలుగా ఉన్న లక్నవరం కాకతీయుల నాటి నిర్మాణం. సరస్సులోని ద్వీపాలను కలుపుతూ పర్యాటక శాఖ నిర్మించిన ఊయల వంతెన(సస్పెన్షన్ బ్రిడ్జి) ప్రధాన ఆకర్షణ. బోటింగ్ సౌకర్యంతో పాటు కాటేజీలు ఉన్నాయి. ఇటీవలే ప్రారంభమైన లేక్‌వ్యూ రెస్టారెంట్ సరికొత్త రుచుల్ని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి 212 కిలోమీటర్ల దూరంలో ఉందీ లక్నవరం.

ఇలా చేరుకోవచ్చు...
-హైదరాబాద్ నుంచి రైలు, బస్సు ద్వారా హన్మకొండ, వరంగల్ చేరుకోవచ్చు.
-అక్కడి నుంచి ములుగు వెళ్లే దారిలో 50 కిలో మీటర్ల దూరం వెళితే చల్వాయి గ్రామం వస్తుంది. 
-అక్కడ నుంచి కుడివైపు తిరిగి ప్రయాణిస్తే బుస్సాపూర్ దాటిన తర్వాత 
లక్నవరం సరస్సు వస్తుంది. ఒక్కొక్కరికీ బస్సు చార్జీ 
సుమారు రూ.150 వరకు అవుతుంది. 

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం (27.09.2013)


నమస్తే తెలంగాణ  సౌజన్యం తో...

25, సెప్టెంబర్ 2013, బుధవారం

యాత్రలంటే ఇష్టమా...

ప్రస్తుతం 851 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 141 రాష్ట్రపార్టీలయందున్నాయి. వీటిలో 660 సాంస్కృతిక, 166 సహజసిద్ధ మరియు 25 మిశ్రమ ప్రత్యేకతల ప్రదేశాలున్నాయి.

భారతదేశములోని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా :-

1 తాజ్ మహల్, ఉత్తర ప్రదేశ్.ప్రపంచపు ఏడు వింతలు క్రొత్తవిలో ఒకటి.
2 ఆగ్రా కోట, ఉత్తర ప్రదేశ్
3 అజంతా గుహలు, మహారాష్ట్ర
4 బౌద్ధ స్థూపాలు సాంచి బౌద్ధ స్థూపాలు మధ్యప్రదేశ్, సాంచి, మధ్య ప్రదేశ్.
5 చంపానేర్-పావగఢ్ పురావస్తు వనం, గుజరాత్
6 ఛత్రపతి శివాజీ టెర్మినస్, మహారాష్ట్ర
7 గోవా చర్చీలు మరియు కాన్వెంట్లు గోవా
8 ఎలిఫెంటా గుహలు, మహారాష్ట్ర
9 ఎల్లోరా గుహలు, మహారాష్ట్ర
10 ఫతేపూర్ సిక్రీ, ఉత్తర ప్రదేశ్
11 చోళులు నిర్మించిన మహాదేవాలయాలు, తమిళనాడు
12 హంపి వద్ద నిర్మాణ సమూహాలు, హంపి, కర్ణాటక
13 మహాబలిపురం వద్ద నిర్మాణ సమూహాలు, మహాబలిపురం, తమిళనాడు
14 పట్టాడకల్ వద్ద నిర్మాణ సమూహాలు, పట్టాడకల్, కర్ణాటక
15 హుమాయూన్ సమాధి, ఢిల్లీ
16 కాజీరంగా జాతీయవనం, అస్సాం
17 కియోలాడియో జాతీయవనం, రాజస్థాన్
18 ఖజురహో వద్ద నిర్మాణ సమూహాలు, ఖజురహో, మధ్య ప్రదేశ్
19 మహాబోధి మందిరం, బీహార్
20 మానస్ జాతీయ అభయారణ్యం, అస్సాం
21 భారత పర్వత రైల్వేలు
22 నందా దేవి జాతీయవనం మరియు పుష్పాల లోయ జాతీయ వనం, ఉత్తరాంచల్
23 కుతుబ్ మీనార్, ఢిల్లీ.
24 భింబేట్కా రాతికప్పులు, మధ్యప్రదేశ్
25 ఎర్ర కోట, న్యూఢిల్లీ
26 కోణార్క సూర్య దేవాలయం, ఒరిస్సా
27 సుందర్ బన్ జాతీయవనం, పశ్చిమ బెంగాల్.
28 

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

సంప్రదాయాలని రక్షించే గ్రామం "శిల్పారామం"

                   హైదరాబాద్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్ యొక్క హస్తకళలకే కాకుండా దేశ వ్యాప్తంగా కళలకి ప్రాముఖ్యత పొందిన ప్రాంతం. ప్రఖ్యాతి గాంచిన కళలు మరియు హస్త కళా వస్తువుల గ్రామం మాదాపూర్ లో హైటెక్ సిటీ కి దగ్గరలో ఉన్నది శిల్పారామం. భారత దేశం యొక్క పురాతన కళల సంప్రదాయాలని రక్షించే ఆలోచనతో ఈ గ్రామాన్ని నిర్మించారు.

           



1992 లో ప్రారంభమైన దేశం లో ని వివిధ సాంప్రదాయక పండుగలని చక్కగా నిర్వహించడం వలన ఈ గ్రామం జాతీయ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ పండుగలు వల్ల భారత దేశం యొక్క వివిధ హస్తకళాకృతుల గురించి తెలియడమే కాకుండా అంతరించిపోకుండా ప్రాచీన కళల ని సంరక్షించే అవకాశం కూడా మీకు లభిస్తుంది. 

సాంప్రదాయ ఆభరణాలు, ఎంబ్రాయిడరీ వస్త్రాలు, చేతితో చెక్కబడిన ఫర్నిచర్ అలాగే ఎన్నో రకాల వస్తువులని ఇక్కడ కొనుక్కోవచ్చు. కనుల విందుగా ఉండే పచ్చటి లాన్స్ లో ఈ గ్రామాన్ని నిర్మించారు. 

           మా కుటుంబసభ్యులతో కలిసి మొదటిసరి ఆదివారం (15.09.2013) శిల్పరామం ను సందర్శించడం జరిగింది. 







17, సెప్టెంబర్ 2013, మంగళవారం

ప్రపంచ పోరాటాల చరిత్రలోనే గొప్ప రోజు...

              సెప్టెంబర్‌ 17 కొందరు చెబుతున్నట్లుగా నైజాం ప్రభుత్వాన్ని కేంద్రం పంపిన బలగాలే లొంగదీసుకున్నాయన్నది కూడా చరిత్రకు వక్రీకరణే. నిజానికి మొదట నిజాం రాజుతో నెహ్రూ ప్రభుత్వం యథాతథ ఒప్పందం చేసుకొని రాజీ పడ్డది. సాయుధ రైతాంగ పోరాటం ఉధృతం కావడంతో నిజాం పాలన కూలిపోయే దశకు చేరిన తరువాతనే కమ్యూనిస్టు ప్రాబల్యాన్ని అణిచివేయడం కోసమే నెహ్రూ సైన్యాలు రంగంలోకి దిగాయి. 1947లో పాకిస్తాన్‌తో యుద్ధంలో ప్రయోగించిన సైన్యం కంటే ఇక్కడ కమ్యూనిస్టులను అణిచేందు కోసం ఎక్కువ సైన్యాన్ని నెహ్రూ ప్రభుత్వం ప్రయోగించిన విషయాన్ని మరచిపోరాదు. పటేల్‌ నేతృత్వంలో ఈ సైన్యం నాలుగు వేల మంది కార్యకర్తలను పొట్టనపెట్టుకుంది. సెప్టెంబర్‌ 17న నిజాం ప్రభువు లొంగిపోయిన తరువాత కూడా రాజప్రముఖ్‌ హోదా కొనసాగించారు.

       సెప్టెంబర్‌ 17 నిజాం పాలనలోని హైదరాబాద్‌ స్టేట్‌ ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైన రోజు. భూమి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన చారిత్రాత్మక తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట ఫలితమిది. రాచరిక పాలన నుంచి విముక్తి లభించినప్పటికీ భూమి సమస్య నేటికీ పరిష్కారం కాలేదు. భూస్వామ్య దోపిడీ నుంచి పూర్తిగా విముక్తి సాధించలేదు. పైగా హైదరాబాద్‌ విముక్తి దినోత్సవంగా సెప్టెంబర్‌ 17కు రకరకాల భాష్యాలు చెబుతున్నారు. కొందరు ప్రస్తుత రాజకీయ ప్రయోజనాల కోసం అప్పటి చరిత్రను వక్రీకరిస్తున్నారు. 

 ప్రపంచ  పోరాటాల చరిత్రలోనే అరుణాక్షరాలతో లిఖించబడిన గొప్ప రోజు...
సెప్టెంబరు 17న తెలంగాణా పోరాట వారసత్వాన్ని సంస్మరించుకొంటున్న రోజు... 
  • ( ప్రజాశక్తి    సహకారంతో ...)

16, సెప్టెంబర్ 2013, సోమవారం

హైదరబాద్ లో భారీ గణేష్ లు

          భారీ గణేష్ లను సందర్శించడం కొసం  చివరి ఆదివారం సందర్శికులు భారీగా హాజరైనారు.     

            మా కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం (15.09.2013) హైదరబాద్ లో 59 అడుగులతో ఏర్పాటైన భారీ  ఖైరతాబాద్  గణేష్ ను, టివి9 వారుచే శిల్పరామంలో మట్టితో ఏర్పాటైన 72 అడుగుల భారీ గణేష్ ను సందర్శించడం జరిగింది.  చివరి ఆదివారం సందర్శికులు  భారీ  హాజరైనారు. సాయంకాలం ట్యాంక్ బండ్ వద్ద గణేష్ ల నిమజ్ఙనం తిలకించారు. 





9, సెప్టెంబర్ 2013, సోమవారం

మట్టి వినాయకులను ప్రొత్సహిద్దాం...

శాంతి సామరస్యాలతో వినాయక ఉత్సవాలు జరగాలని కోరుకుంటూ
 మీకు మీ కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు,  మిత్రులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు...

5, సెప్టెంబర్ 2013, గురువారం

నాటి ఉపాధ్యాయ దినోత్సవం-మా జ్ఙాపకాలు

22 ఏళ్ళ నాటి మా స్కూల్ ఉపాద్యాయ దినోత్సవం ఫొటోలు ఇవి.
          ఈ అరుదైన ఫొటోలో  24.01.1991 సం.లో రేమద్దుల గ్రామములో ఉపాధ్యాయ దినోత్సవం జరిగిన నాటి  స్మృతులను గుర్తు చేసినాయి.  నాటి నా గురువు గార్లను, నా మిత్రులను అందర్నీ, అప్పట్లో ఏ ఏ రూపాల్లో  చూసామో అలాగే వారి  జ్ఙాపకాలు చూడగలిగాము.   
    గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు.  మా గురువులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు. 


SSC 1991 Batch Teacher day photo :
Mana school Teachers : Head Master Subbareddy garu, Narayana, Saireddy, Virendar, N.Krishnaiah, V. Krishnaiah, Balaiah, Karnakareddy, A. Balaiah...., Medam others

Students (One day Teachers)  :
SSC 1991 Batch Ram Reddy, Bhaskar, Parandamulu, Suresh, Gopala krishna, Sumitra,Vijayalaxmi, and  SSC 1992 batch Raghunathreddy, Balaiah, Veeraiah, Krishnaiah, Laxmaiah chary,  Urmila, Manjula, Rajyalaxmi, and 1993 batch  Anuradha ... others.

 రేమద్దుల1.బ్లాగ్ నుండి ఫొటోలు సేకరణ. 

గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

           ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నత శిఖరాలు అధిరోహించి రాష్ట్రపతి పదవిని అధిష్టించిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి.  ప్రతియేటా  సెప్టెంబర్‌ 5 వారి జన్మదినం సందర్భముగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నాయి.

          తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవితకు ఉపాధ్యాయులే ప్రత్యక్ష దైవాలుగా భావించి, తమ పిల్లలను పాఠశాలలో చేర్చుతారు. కొండంత ఆశతో పిల్లల బంగారు భవితకై ఎదురు చూస్తుంటారు. తల్లిదండ్రుల ఆశలను నిజంగా నిజం చేయుట కొఱకు అహర్నిశలూ తమ విద్యార్థుల అభ్యున్నతికై కొంత మంది గురువులు  శ్రమిస్తారు. అలాంటి  నిజమైన నిస్వార్థ ఉపాధ్యాయులను ఎంతగా గౌరవించినా అది తక్కువే ఔతుంది. 

     సమాజంలో గురువులకు ఇచే గౌరవాలు, విలువలు కాలమాన పరిస్థితుల్ని బట్టి మారుతుంటాయి.  ఉదారవాద ఆర్థిక విధానాలు అన్ని రంగాలనూ ప్రభావితం చేసినట్లే విద్యారంగాన్ని, ఉపాధ్యాయ వృత్తినీ దెబ్బతీస్తున్నాయి. సమాజంలో విద్యా, వైజ్ఞానిక అవసరాలు ఉన్నంతకాలం, సమాచార సాంకేతిక వ్యవస్థ ఎంత విస్తరించినా ఉపాధ్యాయుల పాత్ర అజరామరంగా నిలుస్తుంది.