27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

ఏడు ద్వీపాల సమూహం...


ఏడు ద్వీపాల సమూహం.. లక్నవరం సరసు
వరంగల్ నుంచి ములుగు వెళ్లే దారిలో లక్నవరం ఉంది. మూడు వైపులా కొండలు, మధ్యలో 10 వేల ఎకరాల్లో ఈ చెరువు విస్తరించి ఉంది. ఏడు చిన్నచిన్న ద్వీపాలుగా ఉన్న లక్నవరం కాకతీయుల నాటి నిర్మాణం. సరస్సులోని ద్వీపాలను కలుపుతూ పర్యాటక శాఖ నిర్మించిన ఊయల వంతెన(సస్పెన్షన్ బ్రిడ్జి) ప్రధాన ఆకర్షణ. బోటింగ్ సౌకర్యంతో పాటు కాటేజీలు ఉన్నాయి. ఇటీవలే ప్రారంభమైన లేక్‌వ్యూ రెస్టారెంట్ సరికొత్త రుచుల్ని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి 212 కిలోమీటర్ల దూరంలో ఉందీ లక్నవరం.

ఇలా చేరుకోవచ్చు...
-హైదరాబాద్ నుంచి రైలు, బస్సు ద్వారా హన్మకొండ, వరంగల్ చేరుకోవచ్చు.
-అక్కడి నుంచి ములుగు వెళ్లే దారిలో 50 కిలో మీటర్ల దూరం వెళితే చల్వాయి గ్రామం వస్తుంది. 
-అక్కడ నుంచి కుడివైపు తిరిగి ప్రయాణిస్తే బుస్సాపూర్ దాటిన తర్వాత 
లక్నవరం సరస్సు వస్తుంది. ఒక్కొక్కరికీ బస్సు చార్జీ 
సుమారు రూ.150 వరకు అవుతుంది. 

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం (27.09.2013)


నమస్తే తెలంగాణ  సౌజన్యం తో...

1 కామెంట్‌:

  1. namusthe veeraiah garu mi blog chusakaa na kuthuhalanni aapukolekaa eppati nundoo pending lo unna laknavaram yathraaa 25th dec roju na yatra happy ga muginchanuuuu.... anukoni prayanam tho kastha ibbandii padda chala baga enjoyyy chesanuuuu... marinii manchii yatralu parichayamm chestharaniii untanuu byeee dayalavanya

    రిప్లయితొలగించండి