13, ఏప్రిల్ 2020, సోమవారం

తిండిలేక చాలా ఇబ్బందులు పడుతున్నవలస కార్మికులకు చేయుత ..

మొదటి ఫెస్‌ పంపిణి ...12.04.2020
తిండిలేక చాలా ఇబ్బందులు పడుతున్న ఛత్తీస్‌ఘడ్‌, బీహర్‌, ఒరిస్సా, మహారాష్ట్ర, జార్‌ఖండ్‌ మరియు తెలుగు రాష్ట్రాల వలస కార్మికులకు  హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో బియ్యం5 కెేజీలు, కందిపప్పు1కెేజీ, విజయా నూనె1కేజీ, షుగర్‌ 500 గ్రా.,చింతపండు 250 గ్రా...మొదలగు 10 రకాల వస్తువులతో కూడిన ప్యాక్‌లు పంపిణి చేయడం జరిగింది.


కరోనాతో తెలంగాణ గతనెల 23 నుంచి ఈనెల 14 వరకు, గతనెల 24 నుంచి భారతదేశం మొత్తం లాక్‌డౌన్‌ అయ్యినప్పటి నుండి కార్మికుల కష్లాలు బాగా పెరిగిపోయాయి. ఇక్కడ పని లేక, ఇతర రాష్ట్రాల వారు, ఇతర జిల్లాల వారు సొంత ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో వుండిపోయి తిండిలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ లాంటి వారికి ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి గాని, ఇతరుల నుండి గాని ఏలాంటి సహకారం అందడం లేదు. మేము అటువంటి వారిని హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో సర్వే చేసి కొంత మందిని గుర్తించి, వారికి సహకారం అందింస్తున్నాము. 
బీయ్యం, కంది పప్పు, నూనె ... ప్యాకెట్స్‌ పంపిణి కార్యక్రమంలో వీరయ్య, పి. శ్రీనివాస్‌రావు, డి. మోహన్‌, సిహెచ్‌ రమణ, ఉత్తమ్‌ తదితరులు పాల్గొన్నారు. పాత నల్లకుంటలో ఏరియా కమిటి ఆధ్వర్యంలో స్థానిక ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించాము. అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన వారికి ధన్యవాదాలు.

డిడి కాలనీలో హహోబిలం టెంపుల్‌ దగ్గరలో కన్‌స్ట్రక్షన్‌ అగిపోయిన 
నాలుగు అపార్ట్‌మెంట్స్‌లో వలస కార్మికులకు ఈ రోజు 
మొత్తం 15 ఫ్యామిలీలకు, 28 మంది బ్యాచ్‌లర్స్‌కు ప్యాకెట్స్‌ పంపిణి చేశాము.
వారి లిస్టు : 
ఛత్తీస్‌ఘడ్‌ 6 ఫ్యామిలీలు,4 బ్యాచ్‌లర్స్‌  బీహర్‌ 4 బ్యాచ్‌లర్స్‌ , ఒరిస్సా 2 బ్యాచ్‌లర్స్‌ , మహారాష్ట్ర 1 ఫ్యామిలీ , జార్‌ఖండ్‌ 6 బ్యాచ్‌లర్స్‌,  రాజస్థన్‌ 1 బ్యాచ్‌లర్‌  నెల్లూరు 2 ఫ్యామిలీలు,6 బ్యాచ్‌లర్స్‌  ప్రకాశం 2  మిలీలు, శ్రీకాకుళం 5 బ్యాచ్‌లర్స్‌  జనగాం 3 ఫ్యామిలీలు మహబూబబాద్‌1 ఫ్యామిలీ







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి