5, మే 2020, మంగళవారం

COVID-19 అనంతర ప్రపంచం - నా అంచనాలు


1) Life Styles - కుటుంబ జీవనంలో గణనీయమైన మార్పు వస్తుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా Western countries లో కుటుంబ బంధాలు ఇప్పటివరకు బలహీనంగా ఉన్నాయి. లాక్ డౌన్ వల్ల , బ్రతుకు భయం వల్ల కుటుంబ సంబంధాల్లో అవగాహన పెరుగుతుందని, ఆత్మీయతలు తెలియకుండానే పెరుగుతాయని, ఇవి కుటుంబ వ్యవస్థ బలోపేతానికి దారి తీస్తాయని భావిస్తున్నాను.
ఆహారపు అలవాట్లలో కూడా గణనీయమైన మార్పు వస్తుందని, సొంతంగా ఆహారాన్ని తయారుచేసుకుని తినే అలవాటు పెరుగుతుందని నా నమ్మకం.
2) Medical & Health care - Western countries లో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా ప్రైవేట్ శక్తుల చేతుల్లో ఉంది. అందువల్లే COVID 19 ను ఎదుర్కోవడంలో అవి విఫలమయ్యాయి అని నేను భావిస్తున్నాను. అమెరికా లాంటి అత్యున్నత దేశంలో కేవలం 89,000 వెంటిలేటర్లు ఉండడం, PPE కిట్లు అందుబాటులో లేకపోవడం దుస్థితిని తెలియజేస్తోంది. భారత్ లాంటి దేశాలు అమెరికా కన్నా మెరుగ్గా COVID 19 ను ఎదుర్కో కలుగుతున్నాయి అంటే ఇక్కడ వున్న ప్రభుత్వ రంగంలోని హాస్పిటల్స్ కారణం. భారత ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు COVID 19 వైద్యాన్ని మొత్తం ప్రభుత్వ రంగంలోనే చేయించడం వల్ల కేసులను అర్థం చేసుకోవడం, నియంత్రించడం సాధ్యమవుతోంది . అదే ప్రైవేటు రంగానికి వదిలి ఉంటే ఎక్కడ ఎన్ని కేసులు ఉన్నాయో, అది ఎంత స్ప్రైడ్ అవుతుందో, వైద్యం పేరిట వారెంత దోపిడీ చేస్తారో ఊహించుకుంటేనే భయమేస్తుంది. కనుక రానున్న రోజుల్లో ప్రభుత్వ రంగంలో వైద్య రంగాన్ని బలోపేతం చేసే విషయంలో అన్ని దేశాలు ముందడుగు వేస్తాయని భావిస్తున్నాను.
3) Personal & Community Hygiene - ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే Western countries లో నే COVID 19 ఎక్కువగా వ్యాపించింది. Personal hygiene తక్కువగా ఉండి ఎక్కువగా మురికితో సహవాసం చేసే మనలాంటి దేశాల్లో ఉద్ధృతి కొంత తక్కువగానే ఉంది. దీనిని బట్టి మురికితో సహవాసం చేసేవారికి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుందనేది అర్థమవుతుంది. అంతేకాకుండా మన దగ్గర మలేరియా, తట్టు లాంటి రోగాలు ఇప్పటికీ ఉండడం వల్ల మనం హైడ్రోక్లోరొక్విన్ మందులను, బీసీజీ టీకాలను ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు అవే మనలను రక్షిస్తున్నాయి అంటున్నారు.
మిగిలిన ప్రపంచం మలేరియా లను, తట్టు లాంటి రోగాలను జయించడం వల్ల వారికి hydroxychloroquine, bcg లు అందుబాటులో లేకుండా పోయాయి. కాబట్టి personal hygiene ను ఎక్కువగా పెంచుకున్నా ఇబ్బందేనేమో ఆలోచించాలి.
4) Travel & Hospitality - ఇది బాగా తగ్గవచ్చు. వివిధ దేశాలు తమ దేశంలో ప్రవేశించే వారిపట్ల కఠిన నిబంధనలు అమలు చేయవచ్చు. అలాగే ప్రజలు కూడా కొంతకాలం టూరిజం పై ఆసక్తి కన బరచక పోవచ్చు. ఈ రంగం ఎక్కువగా కుదుపులకు గురయ్యే అవకాశం ఉంది.
COVID19 లాక్ డౌన్ వల్ల పర్యావరణ కాలుష్యం విపరీతంగా తగ్గింది. వ్యక్తిగత వాహనాలు మూలనపడ్డాయి. వాటిని అలాగే మూలన ఉంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెంచడం మంచిది. తద్వారా ప్రపంచాన్ని కాలుష్య రహితంగా మార్చుకోవడానికి అది ఉపకరిస్తుంది. అంతే తప్ప డ్రైవర్ లెస్ వాహనాలను పెంచితే భవిష్యత్తు కాలుష్యంతో మరింత బాధాకరంగా మారుతుంది.
గ్లోబలైజేషన్ కు దూరంగా ఉన్న ఉత్తర కొరియా(ఆంక్షల వల్ల), తుర్కమిస్తాన్, కొన్ని ఆఫ్రికా దేశాలు COVID 19 కు దూరంగా ఉన్నాయి. మిగిలిన ప్రపంచంతో అనుసంధానం లేకపోవడం వాటిని ఈ విషయంలో రక్షించినట్లు ఉంది.
5)Focus on Agriculture & Infrastructure - ఇది అత్యంత అవసరం. గ్లోబలైజేషన్ పేరిట వ్యవసాయ రంగాన్ని విస్మరించారు. అలాగే Infrastructure ను కూడా విస్మ రించారు. వెనకబడిన దేశాలనుంచి ముడి పదార్థాలను దిగుమతి చేసుకున్న అభివృద్ధి చెందిన దేశాలు తమ దగ్గర వస్తువులను తామర తంపరగా ఉత్పత్తి చేసి ప్రపంచమంతా వెదజల్లిన ఫలితంగా మన దేశం లాంటి దేశాలలో కనీసం ఆడవాళ్ళు తలలో పెట్టుకునే పిన్నీసులు సైతం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అలాగే ఆహార పదార్థాల విషయంలో కూడా అనేక దేశాలు దిగుమతుల మీద ఆధారపడ్డాయి. అలాంటి దేశాలన్నీ లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.మహాత్మా గాంధీ స్వయం పోషక గ్రామాలు ఉండాలని కోరుకున్నాడు. ప్రతి గ్రామం యొక్క అవసరాలు అన్ని ఆ గ్రామంలోనే తీరాలి అనేది ఆయన కోరిక. ఈ సూత్రాన్ని ప్రస్తుతం అన్ని దేశాలు అనుసరించడం మంచిది. ప్రతి దేశము తమకు అవసరమైన ఆహారాన్ని, వస్తువులను, ఇంధనాలని, ప్రతి దాన్ని సమకూర్చుకొని స్వయం సమృద్ధం అవడం మంచిది.
6)Low Cost Living - ఇది అనివార్యం. ఇప్పటికే రెండు నెలలు లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలు స్తంభించి ఆర్థిక చలనం ఆగిపోయింది. నూటికి ఎనభై శాతం మందికి పైగా జీతం లేకపోవడమో లేదా జీతంలో కోత పడడమో జరిగాయి. గ్లోబలైజేషన్ పుణ్యం వల్ల వస్తు సంస్కృతి, విలాస సంస్కృతి పెరిగి అందరూ EMI లకు అలవాటు పడ్డారు. ఇప్పుడు వాటిని చెల్లించడమే పెద్ద భారం. భారత్ లో కొంత పొదుపు అలవాటు ఉంది. యూరప్ దేశాలలో పొదుపు అలవాటు లేని కారణంగా ఉన్న సొమ్ము తో రెండు నెలలకు మించి బతకలేని దుస్థితి ఉంది. రానున్న సంవత్సరం లేదా ఆపైన ఆర్థిక మాంద్యం కొనసాగక తప్పదు. అందువల్ల జీతాలలో పెరుగుదల 80 శాతం మందికి అసాధ్యమనే చెప్పాలి. కనుక తక్కువ ఖర్చుతో జీవితాన్ని సాగించడం అలవాటు చేసుకుని తీరాలి.
7) China will emerge as Top Country - నా అంచనా ప్రకారం రానున్న రోజుల్లో చైనా ప్రపంచం అగ్రరాజ్యంగా భాసిల్లవచ్చు. COVID19 విషయంలో చైనాను దోషిగా నిలబెట్టాలని మిగిలిన ప్రపంచం ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవచ్చు. ప్రపంచం మొత్తం ఉన్న 200కు పైగా దేశాల్లో దాదాపుగా 80 దేశాలు ఇస్లామిక్ దేశాలు. అలాగే ఆఫ్రికా దేశాలు కూడా గణనీయంగా ఉన్నాయి. ఇస్లామిక్ దేశాలు అమెరికా, దాని అనుబంధ దేశాలకు వ్యతిరేకం కనుక, ఆర్థికంగా, సాంకేతికంగా బలంగా ఉండి వివిధ అంశాలలో తమకు సహకరించే చైనాకు అవి బాసటగా నిలవవచ్చు. ఇక అనేక ఆఫ్రికా దేశాలతో చైనా ఇప్పటికే ఆర్థిక, సాంకేతిక బంధాలను కలిగి ఉంది. పేదరికాన్ని అధిగమించడం కోసం ఆదేశాలు కూడా చైనాకు సహకరించవచ్చు. భారత్ చుట్టూ ఉన్న శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్ లాంటి దేశాలు ఇప్పటికే చైనాతో సత్ సంబంధాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఏ కోణం నుంచి చూసినా చైనా అతి సమీప కాలంలోనే ప్రపంచపు అగ్రరాజ్యంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. చైనాతో వైరం ఉన్న జపాన్, దక్షిణ కొరియా,భారత్ లాంటి దేశాలు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు చైనా వ్యతిరేక కూటమిగా ఉండవచ్చు. రష్యా, జర్మనీ వంటి దేశాలతో పాటు మాజీ సోవియట్ యూనియన్ నుంచి విడివడిన దేశాలు తటస్థ వైఖరి అవలంబించవచ్చు.
8) Is India grab the opportunity? - చాలా మంది ఆశావహులు, ముఖ్యంగా ఒక సెక్షన్ మద్దతుదారులు ఈ pandamic ముగిసిన అనంతరం భారత్ వెలిగి పోతుందని ఇప్పటి నుంచే ఊదర గొడుతున్నారు. అనేక ప్రపంచ దేశాలు చైనా నుంచి తమ ఫ్యాక్టరీలను, ఉత్పత్తులను ఉపసంహరిస్తాయనీ, వాటన్నింటినీ భారత్ కు తరలిస్తారని భావిస్తున్నారు. కొంతమేరకు ఇది జరగవచ్చు. అయితే ఒకప్పుడు సాంకేతికంగా వెలుగొందిన జపాన్, ఇప్పుడు సాంకేతికతలో ముందున్న దక్షిణ కొరియా, ఆ తర్వాత వియత్నాం, తైవాన్ లాంటి దేశాలు ఎక్కువగా లబ్ధి పొందవచ్చు. భారత్ లో మానవ వనరులు అధికంగా ఉన్నా పెద్ద ప్రతికూలత ఏమంటే ఇటీవల సమాజంలో అసహనం పెరగడం. అధికార స్థానంలో ఉన్న వాళ్ళు వాస్తవికత లో కన్నా వాగాడంబరం లో జీవించడం. దేశంలో ఫెడరల్ స్ఫూర్తి కి విఘాతం కలిగించే నిర్ణయాలను, చట్టాలను అమలుపరచడం. వీటన్నింటి వల్ల పొందాల్సిన మేరకు మన దేశం లబ్ధిని పొందలేక పోవచ్చు. అయితే ఇప్పుడున్న దానికన్నా కొంత లాభం జరగ వచ్చు. ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలు తమ దేశాలలోకి ఇతరుల ప్రవేశంపై ఆంక్షలు పెంచనున్న కారణంగా భారత్ లోని software పరిశ్రమ పెరిగే అవకాశం వున్నది. ఇక్కడి నుండే సేవలను ఆయా దేశాలు పొందే అవకాశం గణనీయంగా పెరగవచ్చు.ఇతర రంగాలలో చెప్పుకోదగిన అభివృద్ధి ఉండకపోవచ్చు. కారణం మనదేశంలో ఉన్న పెట్టుబడిదారులలో అధిక శాతం దళారీలుగా వ్యవహరించే ధోరణి ఉన్నవారు. ఎంత ఎక్కువగా బ్యాంకులను, ఇతరులను ముంచాలనే ధోరణి ఉన్నవారు. వారికి మన ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థ కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తూ ఉంటుంది. కనుక ఇతర రంగాల్లో అభివృద్ధి కష్టమే. Software లో పెట్టుబడి తక్కువ ఫలితం ఎక్కువ. కనుక అది విజయవంతం అయ్యే అవకాశం ఉంది.
కొన్ని అంశాలలో ఇవి నా అంచనాలు మాత్రమే.
- టి.వి.రావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి