18, మే 2020, సోమవారం

భారతదేశంలో లాక్‌డౌన్‌ మే 31 వరకు ...

భారతదేశంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో
లాక్‌డౌన్‌ మే 31 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
నిషేధం వీటిపైనే..
''అన్ని జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైల్‌ సర్వీసులు నిషేధం కొనసాగుతుంది. స్కూల్స్‌, కాలేజీలు, ఎడ్యుకేషన్‌, ట్రైనింగ్‌, కోచింగ్‌ సంస్థలు తెరవడానికి వీలు లేదు. ఆన్‌లైన్‌ టెస్టింగ్‌ లెర్నింగ్‌ ఎప్పటిలాగే కొనసాగుతాయి. హోటల్స్‌, రెస్టారెంట్లు, హాస్పిటిలిటీ సర్వీసులు అనుమతి లేదు. సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, జిమ్స్‌, స్విమింగ్‌పూల్స్‌, ఇతర వినోదపార్క్‌లు, థియేటర్స్‌, బార్లు, ఆడిటో రియంలు, అసెంబ్లీ హాల్స్‌ తెరవటానికి అనుమతిలేదు. రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్ర మాలకు అనుమతిలేదు. మతపరమైన సంస్థల్లో ప్రజలకుఅనుమతి లేదు. మతప రమైన ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి లేదు'' అని పేర్కొంది. 

ఒక్కరోజులోనే 4,987:
ఎన్నడూ లేనంతగా కేవలం ఒక్క రోజులో 4,987 పాజిటివ్‌ కేసులు.. ఏకంగా 120 మరణాలు. భారతదేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం ఏమాత్రం ఆగడం లేదనడానికి నిదర్శనాలివీ. కరోనా పాజిటివ్‌ కేసులు 90 వేల మార్కును దాటేయడం గుబులు రేపుతోంది.  దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసులు 90,927కు, మరణాలు 2,872కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి