29, మార్చి 2020, ఆదివారం

నిజం గడప దాటకముందే...

మీత్రులందరికి శుభోదయం...
మిత్రులందరు సామాజిక మాధ్యమాల్లో చిన్నచిన్న జాగ్రత్తలు పాటించగలరు...

కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తున్నది.
ప్రపంచంలో ఇప్పటికి 6 లక్షల మంది కరోనా బారినపడ్డారు.
దాదాపు 30 వేల మంది చనిపోయారు. 
మరోప్రక్క నకిలీ, తప్పుుడు వార్తలు కుప్పలుగా ప్రచారంతో
ప్రజలను గందరగోళంలోకి నెట్టివేస్తున్నాయి...
ప్రముఖ ఆస్పత్రి వైద్యుడు చెప్పినవి..., 
మరియు జెడీ లక్ష్మీనారాయణ పేరుతో... 
గ్రూప్‌లలో కూడా వచ్చాయి. 
ఆవి నకిలీ అని ఈ రోజు పేపర్‌ వచ్చింది.

మనం పంపుతున్న సమాచారం నిజమా, కాదా,
కచ్చితమైన సమాచారం అని నిర్ధారించుకోవాలి. 
సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి.
తర్వాతే ఇతరులకు పంపించడం చేయలి. 
దానితో తపుడు సమాచార ప్రవాహానికి ఆడ్డుకట్ట వేయవచ్చు.


'' నిజం గడప దాటకముందే,
అబద్దం ప్రపంచాన్ని చుట్టి వస్తుందంటారు'' ఒక సామేత.
ఇపుడు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుప్ప్రచారాలను నమ్మొద్దు.
ప్రభుత్వాలు, ప్రఖ్యాత సంస్థలు, విశ్వసనీయ పత్రికల వార్తలనే నమ్మండి...
...... వీరయ్య 29.03.2020





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి