19, మార్చి 2020, గురువారం

కరోనా నియంత్రణకు భారత్‌లో కఠిన నిర్ణయాలు...

 కరోనా వైరస్‌ నియంత్రణ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. 
కరోనా మూడో దశకు వెళ్లకుండా గట్టి చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 
గురువారం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది.
 మార్చి 22 నుంచి వారం రోజులపాటు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
 65 ఏళ్లకు పైబడినవారు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించింది. 
పౌరవిమానయాన, రైల్వేల్లో పాసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 
వారం పాటు అంతర్జాతీయ సరిహద్దులను మూసివేస్తున్నట్టు పేర్కొంది. 
అత్యవసర సర్వీసులు మినహా అందరూ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని కోరింది. 

కరోనా మహమ్మరి ఈరోజు భారత్‌లో మరోకరిని బలితీసుకుంది.
పంజాబ్‌లో కరోనా వైరస్‌ సోకిన 72 ఏళ్ల వృద్దుడు గురువారం మృతిచెందాడు.
దీంతో భారత్‌లో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. 
ఇటీవలే అతను జర్మనీ నుంచి ఇటలీ మీదుగా భారత్‌కు వచ్చినట్టుగా తెలుస్తోంది. 
ఇప్పటివరకు కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్రలలో కరోనా మరణాలు నమోదయ్యాయి. 
తాజా సమాచారం ప్రకారం దేశంలో కరోనా సోకినవారి సంఖ్య 169కు చేరింది. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి