25, జులై 2019, గురువారం

హైదరాబాద్ జిందాబాద్ మూడో వార్షికోత్సవం...

హైదరాబాద్ జిందాబాద్ మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు (21.07.2019) సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్ జిందాబాద్ అధ్యక్షులు శ్రీ పాశం యాదగిరి గారి అధ్యక్షతన సభ జరిగింది. సుప్రీం కోర్ట్ సీనియర్ అడ్వకేట్ శ్రీ పి నిరూప్ రెడ్డి గారు హైదరాబాద్ ను కాపాడుకుందాం - చారిత్రక కట్టడాలను కాపాడుకుందాం అనే అంశంపై ప్రారంభోపన్యాసం చేశారు. 
                    సభలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ గడ్డం మోహన్ రావు గారిని, 2019 నీట్(ఎంబిబిఎస్)లో స్టేట్ 39వ ర్యాంకు, జాతీయస్థాయిలో 892 ర్యాంకు సాధించిన ఎర్రం లక్ష్మీ ప్రతిమ గారిని అభినందిస్తూ సన్మానించడం జరిగింది. ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులు సంజీవ రెడ్డి, కె.వీరయ్య, రమణ, పి. నాగేశ్వర్‌రావు, అమీన్,ఎర్రం శ్రీనివాస్‌, మల్లం రమేష్, శివప్రసాద్ సహయ కార్యదర్శులు సంజీవ రావు, విజరుకుమార్‌, పి.శ్రీనివాస్‌,కె.భరత్, జెకె శ్రీనివాస్ , మోహన్, నర్సింగ్,సంగీత, బాబు తదితరులు పాల్గొన్నారు.
                        వార్షికోత్సవంలో ప్రముఖ సీనియర్ మ్యాజిక్ కళాకారులు ఖాజా గారు, ప్రముఖ మిమిక్రీ కళాకారులు కళారత్న మల్లం రమేష్ గారు, మిమిక్రీ కళాకారులు వేణుగోపాల్ గారు, నరేష్ గారు పాల్గొన్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి