13, ఆగస్టు 2018, సోమవారం

మొక్కలు నాటి పర్యావరణ రక్షణ కోసం కృషి ... Hyderabad zindabad

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో జరిగిన '' హరిత హారం '' కార్యక్రమాన్ని జిహెచ్‌ఎంసి జోనల్‌ కమీషనర్‌ శ్రీ రఘుప్రసాద్‌ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమం (12.08.2018 ) ఆజమాబాద్‌ ఇండిస్టేయల్‌ ప్రాంతంలో జరిగింది. కార్యక్రమంలో రాంనగర్‌ కార్పొరేటర్‌ శ్రీ శ్రీనివాస్‌ రెడ్డి గారు, జిహెచ్‌ఎంసి డిప్యూటి కమీషనర్‌ శ్రీ కృష్ణ శేఖర్‌ గారు, హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు శ్రీ పాశం యాదగిరి గారు, ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌ రావు గారు అతిథులు మరియు హాజరైన అందరు మొక్కలు నాటి పాలు పంచుకున్నారు. పట్టణీకరణతో వాహనాలు సంఖ్య పెరిగి వాతావరణ కాలుష్యం పెరుగుతున్నదాని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి నగరంలో పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు నిచ్చారు. మొక్కలు నాటి పర్యావరణ రక్షణ కోసం తమ వంతు కృషి చేయాలని అన్నారు.







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి