17, సెప్టెంబర్ 2011, శనివారం

సందిగ్ధంలో పరీక్షలు...

త్రైమాసిక పరీక్షలు ఉన్నయా  లేవా .... 

           రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 19 నుంచి 26 వరకూ నిర్వహించబోయే త్రైమాసిక పరీక్షలపై సందిగ్ధం నెలకొంది. తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు.   దీంతో త్రైమాసిక పరీక్షలు జరుగుతాయా? లేదా అన్న విషయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సకల జనుల సమ్మె ఒకవైపు, ఉపాధ్యాయుల నిరవధిక సమ్మె మరోవైపు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం రావడం లేదు. పరీక్షల గురించి  విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని భరోసా ఇవ్వడం లేదు. స్పష్టమైన ఆదేశాలను కూడా ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే విద్యార్థులు, తల్లిదండ్రుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతోంది. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చకుండా విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు విద్యాశాఖ అధికారులనూ డైలమాలో పడేసింది.

           ఇంతకుముందే ఈనెల 27 నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకూ దసరా సెలువులూ ప్రకటించింది.    
           వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు  స్పష్టమైన ఆదేశాలను  ఇవ్వలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి