23, మార్చి 2020, సోమవారం

పేరు వినిపిస్తేనే హృదయాలు ఉత్తేజితమవుతాయి....

భగత్‌సింగ్‌ పేరు వినిపిస్తేనే భారతీయులందరికి హృదయాలు ఉత్తేజితమవుతాయి.
భగత్‌సింగ్‌ 23 ఏళ్ళకే భారతదేశ స్వాతంత్య్రం కోసం ఉరి కంభం ఎక్కిన త్యాగశీలురు. 
భగత్‌సింగ్‌ ఒక గొప్ప వీరుడుగా, సాహసిగా, ధైర్యవంతుడుగా బాగా సుపరిచితుడయ్యారు.
'ఇంక్విలాబ్‌-జిందాబాద్‌' అని వారు ఇచ్చిన నినాదం యావత్‌ జాతికి స్ఫూర్తిదాయకంగా మారి
సామ్రాజ్యవాదులను గడగడ లాడించాయి. 

దోపిడి, అన్యాయాలకు వ్యతిరేకంగా సమసమాజ స్థాపన కోసం పోరాడిన భగత్ సింగ్ కి విప్లవ జోహార్లు.
వారి స్ఫూర్తితో భారతదేశ సార్వభౌమాధికారం, జాతీయ సమైక్యత, మానవత్వం, మత సామరస్యం కోసం 
పాటుపడాలనే చైతన్యాన్ని యువతలో  పెంపొందించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి