28, జనవరి 2020, మంగళవారం

లౌకిక వాదాన్ని పరిరక్షించాలని...

లౌకిక వాదాన్ని పరిరక్షించాలని,పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులకు జిహెచ్‌ఎంసి డిప్యూటి కమీషనర్‌ ఉమా ప్రకాష్‌ గారు విజ్ఞాప్తి చేశారు. హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో 70 సంవత్సరాల భారత రాజ్యంగం - సెక్యులరిజం అనే అంశంపై ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన హైస్కూల్‌ విద్యార్థుల పోటీలను ప్రారంభించారు.   
డా|| జయసూర్య గారు, హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు పాశం యాదగిరి గారు, మహిళ ఉద్యమ నాయకురాలు నాగలక్ష్మి గారు తదితరులు పాల్గొన్నారు.
 రాంనగర్‌, నల్లకుంట, హిమాయత్‌నగర్‌ డివిజన్‌లలోని 10 స్కూల్‌లలో వ్యాసరచన, ఉపన్యాసం, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహిస్తే దాదాపు 1100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్‌ స్థాయిలో విజేతలకు నేడు జోన్‌ స్థాయి పోటీలు జరిగాయి. ఈ పోటీలలో విజేతలకు రవీంద్రభారతిలో ఫిబ్రవరి 9న జరిగే కల్చరల్‌ ఫెస్టివల్‌లో ప్రముఖల ద్వారా బహుమతులు ఇవ్వబడుతాయి. 
 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి