15, ఆగస్టు 2019, గురువారం

మహానీయుల త్యాగాలను కాపాడుకోవాలి...73వ స్వాతంత్య్ర దినోత్సవం

 హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆఫీసు :
              దేశ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులపై ఉందని వాటర్‌ వర్క్‌ ్స డిజిఎం శ్రీనివాస్‌రావు గారు అన్నారు. నేడు (15.08.2019) హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆఫీసు వద్ద 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యఅతిధిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వాతంత్య్రం యొక్క ప్రాధాన్యతను, పౌరుల బాద్యతల గురించి వివరించారు. స్వాతంత్య్రం కోసం మహానీయులు చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ, వాటిని కాపాడుకోవడానికి అందరూ కృషి చేయాలని అన్నారు.                
             డా|| జయసూర్య గారు మాట్లాడుతూ యువత ముందుకు వచ్చిన అన్నిసమస్యల పరిష్కారం కోసం పని చేయాలని, మహానీయుల త్యాగాల స్పూర్తితో రాజ్యాంగ పరిరక్షణకోసం పాటుపడాలని అన్నారు.                  
            ఈ కార్యక్రమంలో మాతృశ్రీ ఇఎల్‌ స్కూల్‌ ఇన్‌చార్జి శ్రీమతి రేవతి గారు, వాటర్‌వర్క్‌ ్స మేనేజర్‌ సూర్యనారాయణ గారు, హైదరాబాద్‌ జిందాబాద్‌ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రావు, సహయ కార్యదర్శులు విజరుకుమార్‌, శ్రీరాములు ఉపాధ్యక్షులు రమణ, కె. వీరయ్య, పి. నాగేశ్వర్‌రావు, పి.శ్రీనివాస్‌ నాయకులు నవీన్‌ కృష్ణ, సైదులు, సంగీత, శ్రీలత, రమేష్‌, భీమ్‌రాజ్‌, అనిత, స్వేత తదితరులు పాల్గొంన్నారు.


పాత నల్లకుంట ఏరియా స్ట్రీట్‌ నెం.14 లో :
                       స్వాతంత్య్రం కోసం మహానీయులు చేసిన పోరాటాలను, త్యాగాలను గుర్తు చేస్తూ, వాటిని కాపాడుకోవడానికి అందరూ కృషి చేయాలని సిటిజన్స్‌ ఫోరం నల్లకుంట అధ్యక్షులు మోహన్‌ రావు గారు అన్నారు. పాత నల్లకుంట ఏరియా స్ట్రీట్‌ నెం.14 లో ( సిండికేట్‌ బ్యాంక్‌ - క్షత్రియా టవర్స్‌ లైన్‌ మధ్య ) నేడు జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు. 
                         మోహన్‌ రావు గారు మాట్లాడుతూ స్వాతంత్య్రం యొక్క ప్రాధాన్యతను, పౌరుల బాద్యతల గురించి వివరించారు. యువత ముందుకు వచ్చిన అన్నిసమస్యల పరిష్కారం కోసం పని చేయాలని, మహానీయుల త్యాగాల స్పూర్తితో రాజ్యాంగ పరిరక్షణకోసం పాటుపడాలని అన్నారు. దేశ సమైక్యతకు, సమగ్రతకు అందరూ కృషి చేయాలని ఆయన ఉద్భోదించారు.
                         ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ నాయకులు ఎస్‌. లక్ష్మయ్య గారు, డి. రామకృష్ణరావు , డా.జయసూర్య, డా|| అమర్‌నాథ్‌ , కృష్ణబాబు, వివి సుబ్రమణ్యం, సంజీవ్‌, రమణరావు, హర్ష , ప్రసాద్‌ ' హైదరాబాద్‌ జిందాబాద్‌ ' ఉపాధ్యక్షులు కె. వీరయ్య, నాయకులు డి. మోహన్‌, పి. శ్రీనివాస్‌, రమణ, సోమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి