30, మే 2019, గురువారం

లోక్‌సభ స్థానాల్లో గెలిచిన వారు 88 శాతం కోటీశ్వరులు...

2019 లోక్‌సభ స్థానాల్లో గెలిచిన వారు 88 శాతం కోటీశ్వరులు... 
- గత లోక్‌సభ సభ్యులతో పోలిస్తే 6శాతం పెరుగుదల
- రూ. 10 లక్షలకన్నా తక్కువ ఆస్తి ఉన్నవారు 9 మంది మాత్రమే
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో 83 శాతం కోటీశ్వరులు... (ప్రధాన పార్టీలలోనే)
ఇది మన భారత దేశ పరిస్థితి ...
రాజకీయాల్లో అంగబలం, ధనబలం పెరుగుతుందా? డబ్బున్నవారికే పదవులు దక్కుతున్నాయా? గెలవాలంటే కోట్లు ఉండాల్సిందేనన్న వాదనకు బలం చేకూరుస్తున్నాయి 17వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు. ఎన్నికైన పార్లమెంటు సభ్యుల్లో 475 (88శాతం) మంది కోటీశ్వరులే. 2014 ఎన్నికలతో పోలిస్తే వీరి సంఖ్య 6శాతం పెరిగింది. 2014లో 82శాతం, 2009లో 58శాతం కరోడ్‌పతులు లోక్‌సభలో కొలువుతీరారు. ఎన్నికైన సభ్యుల గణాంకాలను విశ్లేషించిన అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) ఈ వివరాలను వెల్లడించింది. ఏడీఆర్‌ విశ్లేషణ ప్రకారం.. రూ.10 లక్షల కన్నా తక్కువ ఆస్తి వున్న అభ్యర్థుల విజయం రేటు కేవలం 0.3శాతం (9 మంది ఎంపీలు) మాత్రమే. అలాగే దాదాపు మూడో వంతు (30.1 శాతం) ఎంపీలకు రూ.5 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. 542 లోక్‌సభ లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ 303 సీట్లు, కాంగ్రెస్‌ 52, డీఎంకే 23, టీఎంసీ 22, తృణమూల్‌ కాంగ్రెస్‌ 22, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 22 స్థానాల్లో గెలుపొందాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి