5, డిసెంబర్ 2018, బుధవారం

ఓటు హక్కును వినియోగించుకోవాలి...

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్‌బిఐ కాలనీ రిసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ అధ్యక్షులు శ్రీ రాజగోపాల్‌ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ రోజు (05.12.2018) బాగ్‌ అంబర్‌పేట్‌లోని ఎస్‌బిఐ కాలనీ పార్క్‌లో ''హైదరాబాద్‌ జిందాబాద్‌'' మరియు ఎస్‌బిఐ కాలనీ రిసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో ఓటుపై అవగహన పోస్టర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా గురువు సురేంద్ర గారు, లైన్స్‌ క్లబ్‌ నాయకులు విద్య భూషన్‌, డా|| గూలబ్‌ రాణి, కాలనీ నాయకులు రవీంద్రనాథ్‌, హేమలత, డా|| ఆశలత, నారాయణ, కేశవరావు, శ్రీనివాసరాజు, హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు మల్లం రమేష్‌ , కె.వీరయ్య నాయకులు సురేష్‌, రవిప్రసాద్‌, రాంచందర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ రోజు (05.12.2018) ముసారంబాగ్ లోని జ్ఙాన్ దిప్ టవర్స్ లో ''హైదరాబాద్‌ జిందాబాద్‌'' ఆధ్వర్యంలో ఓటుపై అవగహన పోస్టర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. అసోషియేషన్‌ అధ్యక్షులు రవి, ప్రధాన కార్యదర్శి కె భరత్, అసోషియేషన్‌ నాయకులు జగనాథరెడ్డి, కుమార్ , హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు కె.వీరయ్య తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి