24, డిసెంబర్ 2018, సోమవారం

పార్కును కాపాడుదాం...పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
పార్కును కాపాడుదాం
బంజారాహిల్స్‌లోని కేబిఆర్‌ పార్క్‌ను పరిరక్షించాలని కోరుతూ పర్యావరణ ప్రేమికులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. సేవ్‌ కేబీఆర్‌, ప్లై ఓవర్‌ వద్దు - కేబీఆర్‌ ముద్దు...అని ప్లకార్డులతో పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో పాలుపంచుకున్నారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రాథమిక బాధ్యతను మరిచిన ప్రభుత్వం, ప్రకృతి వనరులను ధ్వంసం చేసే విధంగా వ్యవహరిస్తోందని వక్తలు అన్నారు. చెట్లను నరికివేసిన చోట సంతాపం తెలిపారు. 
కార్యక్రమంలో పర్యావరణ వెత్తలు డా. పురోషత్తం రోడి, నర్సింహారెడ్డి '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' అధ్యక్షులు పాశం యాదగిరి, శ్రీనివాసరావు, కె.వీరయ్య, రమణ, జి. క్రాంతి, ఎం. శ్రీనివాస్‌ ... అనేక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి