4, నవంబర్ 2018, ఆదివారం

ప్రజలు మౌనం వీడి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి...

ప్రపంచంలో కాలుష్య ప్రమాదం పొంచి ఉన్నదాని హెచ్చరిస్తూ, మనం ఇప్పటికైనా మౌనం వీడి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రముఖ పర్యావరణవేత్త, రిటైర్డ్‌ సైంటిస్ట్‌ డా|| కలపాల బాబూరావు గారు పిలుపునిచ్చారు. ఈ రోజు (04.11.2018) సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో '' దీపావళి- కాలుష్యం'' పై సదస్సు జరిగింది. సదస్సుకు ముఖ్యఅతిధిగా హజరై ప్రసంగించారు.
డా|| బాబూరావు గారు మాట్లాడుతూ భూతాపం 2 డీగ్రీల పెరుగుదల దగ్గర ఆపితే ప్రమాదం తప్పించవచ్చునీ పారీస్‌ ఓప్పందం చెప్పుతున్నా ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు 1.5 డీగ్రీలకే ప్రమాదం పొంచి ఉన్నదాని హెచ్చరిస్తున్నారని అన్నారు. మనం ఇప్పటికైనా కార్యచరణ చేపట్టాలని, మౌనంగా వుంటే మన మనగడే ఉండదని తెలియజేశారు. స్వీడన్‌ దేశంలో 11 ఏళ్ళ పాప మూడు వారాలు స్కూలుకు వెలకుండా, ఆ దేశ పార్లమెంటు ముందు నిరసనకు కూర్చునదని, స్కూలుకు వెళ్ళి చదువుకున్న భవిష్యత్‌ ప్రమాదంలో ఉన్నందున తను నిరసన తెలుపుతున్నదని తెలయజేశారు. ఇప్పుడు కూడా వారానికి ఒక రోజు నిరసన తెలుపుతున్నదని చెప్పారు. అమెరికాలో 9 ఏళ్ళ పిల్లలు 21 మంది దాదాపు 11 సంవత్సరాల నుండి కోర్టులో పర్యావరణ ప్రమాదం పై ప్రభుత్వం చర్చించాలని కేసు నడుపుతున్నారని, ఈ మధ్యకాలంలో కోర్టు ప్రభుత్వం చర్చ జరపాలని ఆదేశించిందని తెలయజేశారు. పర్యావరణ విద్వంసానికి ప్రజలె కారణమని కొందరు చెపుతున్నారు. పేదల వలన కాలుష్యం ఉండదని, పరిశ్రమల పెట్టిన పెట్టుబడిదారుల వలననే కాలుష్యం పెరుగుతున్నదని అన్నారు.
కార్యక్రమంలో డా|| దాసరి ప్రసాద్‌రావు గారు, డా|| రామ్‌కిషన్‌ గారు, సీనియర్‌ జర్నలిస్టు, హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు శ్రీ పాశం యాదగిరి గారు, ఉపాధ్యక్షులు కె.వీరయ్య, రమణ, పి. నాగేశ్వర్‌రావు, సహయ కార్యదర్శిలు విజరుకుమార్‌, పి.శ్రీనివాస్‌, నాయకులు పి. నాగేష్‌, దుర్గ, సంగీత, శ్రీలత, మణిక్యం, అజరు, మోహన్‌, ఈశ్వర్‌బాబు, రమేష్‌ తదితరులు పాల్గొంన్నారు.




2 కామెంట్‌లు: