3, సెప్టెంబర్ 2018, సోమవారం

వైద్యం ప్రజలందరికీ ప్రాథమిక అవసరం ...

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 2 న అంబర్ పేట లో  ''ఉచిత మెగా వైద్య శిబిరం'' జరిగింది.  శిబిరంలో ప్రముఖ హార్ట్‌ సర్జన్‌, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డా|| దాసరి ప్రసాద్‌రావు గారు, ప్రముఖ ఇఎన్‌టి సర్జన్‌, నోవా హాస్పిటల్‌ అధినేత డా|| ఎం. మోహన్‌ రెడ్డి గారు, , ప్రముఖ ఆర్థో సర్జన్‌ , రవి హేలియోస్‌ హాస్పిటల్‌ అధినేత డా|| బి. విజరు భాస్కర్‌ గారు , ప్రముఖ జనరల్‌ సర్జన్‌, ఆరోగ్య హాస్పిటల్‌ అధినేత డా|| మోహన్‌ గుప్త గారు , హార్ట్‌ సర్జన్‌ డా|| రవికుమార్‌ గారు, హార్ట్‌ సర్జన్‌ డా|| వెంకట్‌ గారు, డెంటల్‌ సర్జన్‌ Ê ఇండిన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ ఉపాధ్యాక్షలు డా|| కె. ఆదిత్య సందీప్‌ గారు, ఇఎన్‌టి సర్జన్‌ డా|| వెంకట్‌ రెడ్డి గారు , ఇఎన్‌టి సర్జన్‌ డా|| నిలిమా గారు , ఇండో యుఎస్‌ ఐ హాస్పిటల్‌ డా|| సోఫియా ఫాతిమా గారు, సీనియర్‌ జర్నలిస్ట్‌, హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు శ్రీ పాశం యాదగిరి గారు ఎస్‌బిఐ రిసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ అధ్యక్షులు శ్రీ రాజగోపాల్‌ రెడ్డి గారు, తదితరులు పాల్గొంన్నారు.
                 ''ఉచిత మెగా వైద్య శిబిరం'' లో గుండె, చెవి ముక్కు గొంతు, కంటి, ఎముకలు- కీళ్ళు, దంతం, జనరల్‌ వంటి ప్రధానమైన అన్ని వ్యాధులకు సంబంధించిన సమస్యల వైద్యం, టెస్టులు, అవగాహన కార్యక్రమాలు జరిగినాయి. పేషేంట్స్‌ ఉచితంగా మందులు అందజేశారు. శిబిరంలో బతుకమ్మకుంట, చుట్టు వున్న బస్తీల నుండి దాదాపు 400 మంది పాల్గొన్నారు.
                 కార్యక్రమంలో హైదరాబాద్‌ జిందాబాద్‌ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ రావు, ఉపాధ్యక్షులు కె. వీరయ్య, రమణ, నాయకులు పి. నాగేష్‌, సంగీత, శివ, రాంచందర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. మరి సంస్థ మేనేజర్‌ శ్రీనివాస్‌, నాయకులు వెంకన్న, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి