20, డిసెంబర్ 2020, ఆదివారం

ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయ్యాలని, ఆపదలో ఉన్న రోగులను ఆదుకోవాలని మాజీ కేంద్ర సమాచార కమీషనర్‌ శ్రీ మాడబూషి శ్రీధర్‌ గారు పిలుపునిచ్చారు.

ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయ్యాలని, ఆపదలో ఉన్న రోగులను ఆదుకోవాలని మాజీ కేంద్ర సమాచార కమీషనర్‌ శ్రీ మాడబూషి శ్రీధర్‌ గారు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మానవ సంఘీవ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో బ్లడ్‌ డోనర్స్‌ క్లబ్‌ ను సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు (20.12.20) ప్రారంభించబడింది. ప్రారంభోత్సవంలో డాక్టర్‌ ప్రసాదరావు గారు లోగోను, శ్రీ మాడభూషి శ్రీధర్‌ గారు పోస్టర్‌ను, డా|| మోహన్‌ రెడ్డి గారు ప్రచార స్టిక్కర్‌ను, శ్రీ జి. కిరణ్‌రెడ్డి గారు డోనర్‌ దరఖాస్తు ఫారమ్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డా|| జయసూర్య, బిఎన్‌ సుదర్శన్‌, హైదరాబాద్‌ జిందాబాద్‌ నాయకులు టిఎన్‌వి రమణ, వీరయ్య, ఎం.శ్రీనివాస్‌రావు, నాగేశ్వర్‌రావు, పి.శ్రీనివాస్‌రావు, నాగేష్‌, శ్రీవల్లి, రాజమౌళి, సంగీత, హస్మిత, ఆమీన్‌ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి