22, మార్చి 2019, శుక్రవారం

తడారుతున్న గొంతులు...

- నేడు అంతర్జాతీయ జల దినోత్సవం మార్చి 22వ తేదీన) 
- 250 కోట్ల మందికి అందని రక్షిత నీరు
- జాగ్రత్తగా వాడుకోకపోతే భవిష్యత్‌ కష్టమే
- ప్రపంచంలో మనదేశ జనాభా 17 శాతం... నీటి వనరులు నాలుగుశాతమే!
- 'మన వెనుక ఎవరూ లేరు' అనే నినాదంతో ఐరాస ముందుకు...
- ప్రతి రోజూ ప్రపంచ వ్యాప్తంగా ఐదేండ్ల లోపు ఉన్న 700 మంది చిన్నారులు డయేరియా, దాని సంబంధిత వ్యాధులతో చనిపోతున్నారు.
- రక్షిత తాగునీటిని తీసుకోకపోవడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 800 మంది గర్భీణీలు చనిపోతున్నారు.
- 68.5 కోట్ల మంది ప్రజలు తాగునీటి వనరులు దొరక్క వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
- 159 కోట్ల మంది ప్రజలు చెరువులు, కాలువులు, కుంటల ద్వారా తెచ్చుకున్న నీటిని తాగుతున్నారు.
                ప్రతి ఒక్కరూ నీటి నిల్వల సంరక్షణ కోసం కంకణం కట్టుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా నీటి వనరులను కాపాడుకునేందుకు ప్రతిఏటా మార్చి 22వ తేదీన అంతర్జాతీయ జల దినోత్సవం జరుపుకోవాలని, భవిష్యత్‌ తరాలకు నీటి వనరులను అందించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ఈ ఏడాది 'మన వెనుక ఎవరూ లేరు' అనే నినాదంతో ముందుకు వెళ్తున్నది. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి