7, మార్చి 2019, గురువారం

కాలుష్య కోరల్లో చిక్కుకున్న భారత్‌...

- ప్రపంచంలోనే 20 అత్యంత కాలుష్య నగరాల్లో భారత్‌లోనే 15...
- ప్రపంచంలోనే అత్యంత కాలుష్యనగరంగా మొదటి స్థానంలో గుర్గావ్‌, 
అలాగే ప్రపంచంలోని అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ నిలిచింది.
భారత్‌లో కాలుష్యం రోజురోజుకూ తీవ్రతరమవు తున్నది. గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణించిపోవడం అనేది దక్షిణాసియాకు ఒక పెద్ద సమస్య అధ్యయనం హెచ్చరించింది. 


ప్రపంచంలో రోజురోజుకు తీవ్ర సమస్యగా పరిణమిస్తున్న గాలి కాలుష్యం భవిష్యత్తులో మానవజాతిపై చెడు ప్రభావాలనే చూపనున్నది. గాలి కాలుష్యం కారణంగా వచ్చే ఏడాది ప్రపంచంలో దాదాపు 70 లక్షల మంది మరణాలు సంభవించే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. దాదాపు రూ. 15.88 లక్షల కోట్ల ఆర్థికభారం ప్రపంచంపై పడే అవకాశం ఉన్నదని, 'కాలుష్యం అనేది ప్రత్యక్షంగా ఆరోగ్యంపై, పరోక్షంగా వైద్యరూపంలో ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని తెలిపారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి