10, సెప్టెంబర్ 2018, సోమవారం

పర్యావరణాన్ని కాపాడాలని "మట్టి గణేష్ ల ఉచిత పంపిణి"

మట్టి గణేష్ లనే ప్రతిష్టిద్దాం... పర్యావరణాన్ని కాపాడదాం...
ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, విష రసాయనాలతో చేసిన వినాయకులు పర్యావరణాన్ని ద్వంసం చేస్తాయాని, అందుకు మట్టి గణేష్‌ విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని, ప్రతి ఇక్కరూ ఇళ్ళలో మట్టి విగ్రహాలను పూజించాలని రిటైర్డ్‌ వ్వవసాయ సైంటిస్ట్‌ శ్రీ ఎం.ఎస్‌. చారి గారు పిలుపునిచ్చారు. నేడు (10.09.2018) బాగ్‌ అంబర్‌పేట్‌లోని ఎస్‌బిఐ కాలనీ పార్క్‌లో హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో '' మట్టి గణేష్‌ల విగ్రహాల ఉచిత పంపిణి '' కార్యక్రమాన్ని ఎం.ఎస్‌.చారి గారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌బిఐ రిసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ అధ్యక్షులు శ్రీ రాజగోపాల్‌ రెడ్డి గారు, లైన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు ఎస్‌. రాంమనోహర్‌, లైన్స్‌ క్లబ్‌ నాయకులు విద్య భూషన్‌, డా|| గూలబ్‌ రాణి, కాలనీ ఆఫీస్‌ బేరర్‌ రవీంద్రనాథ్‌, లత, హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు మల్లం రమేష్‌, కె. వీరయ్య, నాయకులు రమణ, పి. శ్రీనివాస్‌, సురేష్‌, రాంచందర్‌ రాజు, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 


సెప్టెంబర్‌ 9 న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో (హైదరాబాద్‌) జరిగింది.







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి