3, అక్టోబర్ 2013, గురువారం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. ప్రధాని నివాసంలో గురువారం 03.10.2013 సాయంత్రం జరిగిన కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పరిచేందుకు కేబినెట్ అంగీకారం తెలిపిందని చెప్పారు. పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తెలిపారు. విభజన నేపథ్యంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ మంత్రుల బృందం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ బృందం ఇరు ప్రాంతాల ప్రజల భయాందోళనలను పరిగణలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఇది తెలంగాణ ప్రజల విజయం.

1 కామెంట్‌: