26, అక్టోబర్ 2013, శనివారం

క్రిక్కిరిసిన యాత్రా స్థలలో ఒకటిగా షిర్డీ...

         షిర్డీ అనే చిన్న పట్టణం ప్రపంచ వ్యాప్తంగా వున్నా సాయి భక్తుల భక్తి తత్పరతతో గుబాళిస్తుంది. ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో ఈ పల్లెకు అగ్ర తాంబూలం వుంది. క్షేత్రాన్ని ఏడాదిలో ఎప్పుడైనా చూడవచ్చు, కాని వర్షాకాలంలో ఇక్కడ వాతావరణం హాయి గోల్పేదిగా వుంటుంది కనక, వర్షాకాలంలో దర్శించడం మంచిది.  షిర్డిలో జరిగే ప్రధాన పండుగలు – గురు పూర్ణిమ, దసరా, శ్రీరామనవమి.
       
         తిరుపతి తర్వాత భారత దేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం ఇది. సాధారణ దినాల్లో రోజూ ముప్పై వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. అదే పర్వ దినాలలొ అయితే వీరి సంఖ్య లక్షకు దాటుతుంది. హిందువుల యాత్రా స్థలాలలో ఒకటిగా షిరిడీ పరిగణింప బడుతున్నది. ఒక పాత, చిన్న గ్రామం, ఈ రోజు అది దేశంలో  క్రిక్కిరిసిన యాత్రా స్థలలో ఒకటిగా మారిపోయింది.  

             సాయి బాబా యొక్క క్షేత్రానికి రోడ్డు, రైలు  మార్గాల ద్వారా  తేలిగ్గానే చేరుకోవచ్చు. నాశిక్, పూణే, ముంబై ల నుంచి బస్సుల ద్వారా అనుసంధానం చేయబడింది. దగ్గరలోనే విమానాశ్రయం నిర్మిస్తున్నారు.  రోడ్డు ద్వారా ఐతే, అహ్మద్ నగర – మన్మాడ్ రాష్ట్ర రహదారి నెంబర్ 10  మీదుగా రావచ్చు.అహ్మద్ నగర జిల్లాలోని కోపర్గావ్ నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో వుంది.   హైదరాబాద్ నుండి ప్రతిరోజు రైలు వుంటుంది. ఆ రైలు దోరుకాకపొతే  అజంతా ఎక్స్‌ప్రెస్. ఇది సికింద్రాబాద్  మరియు మన్మాడ్ పట్టణాల మధ్య ప్రతిరోజు నడుస్తుంది. నాగర్సూల్ లో దిగితే అక్కడి నుండి  42 కిలోమీటర్ల దూరంలో వుంది         

 ఈ దసర సెలవులలో (2013 అక్టోబర్ 10, 11 తేదిలలో) షిర్డీ పుణ్యక్షేత్రం, శని శింగనాపూర్ లను మా కుటుంబసభ్యులు, బందువులు, స్నేహితులతో కలసి సందర్శించడం జరిగింది.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి