25, డిసెంబర్ 2018, మంగళవారం

24, డిసెంబర్ 2018, సోమవారం

పార్కును కాపాడుదాం...పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
పార్కును కాపాడుదాం
బంజారాహిల్స్‌లోని కేబిఆర్‌ పార్క్‌ను పరిరక్షించాలని కోరుతూ పర్యావరణ ప్రేమికులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. సేవ్‌ కేబీఆర్‌, ప్లై ఓవర్‌ వద్దు - కేబీఆర్‌ ముద్దు...అని ప్లకార్డులతో పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో పాలుపంచుకున్నారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రాథమిక బాధ్యతను మరిచిన ప్రభుత్వం, ప్రకృతి వనరులను ధ్వంసం చేసే విధంగా వ్యవహరిస్తోందని వక్తలు అన్నారు. చెట్లను నరికివేసిన చోట సంతాపం తెలిపారు. 
కార్యక్రమంలో పర్యావరణ వెత్తలు డా. పురోషత్తం రోడి, నర్సింహారెడ్డి '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' అధ్యక్షులు పాశం యాదగిరి, శ్రీనివాసరావు, కె.వీరయ్య, రమణ, జి. క్రాంతి, ఎం. శ్రీనివాస్‌ ... అనేక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.





23, డిసెంబర్ 2018, ఆదివారం

నీటిని సంరక్షించుకోకపోతే...

నిద్ర లేచిన దగ్గర నుండి మళ్లీ రాత్రి నిద్ర పోయే వరకు మనషికి గాలి ఎంత ముఖ్యమో, నీరు కూడా అంతే ముఖ్యం. ఆ నీటిని అపురూపంగా పొదివి పట్టుకుని జాగ్రతగా సంరక్షించుకోకపోతే 2020 నాటికల్లా... 
హైదరాబాద్‌తో సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో జన జీవనం దుర్భరమవుతుందని నీతి ఆయోగ్‌ హెచ్చరిస్తోంది.
ఈ ప్రకృతి యావత్తునూ నడిపించేది నీరే - లియోనార్డో డావిన్సీ
బావి ఎండిపోయిన రోజు తెలుస్తుంది, నీళ్ల విలువ ఏమిటో ! - బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌

18, డిసెంబర్ 2018, మంగళవారం

రోడుపై మట్టికుప్పలు...

హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో జి.హెచ్‌.ఎం.సి డిప్యూటి కమీషనర్‌ గారికి నిన్న కంప్లాయింట్‌ చేయడంతో చాల రోజుల నుండి పెండింగ్‌లో ఉన్న
పాత నల్లకుంట, క్షత్రియా టవర్స్‌ ప్రక్క వీధిలో...రోడుపై మట్టికుప్పలు ఈ రోజు తీసివేశారు. ఈ కార్యక్రమంలో '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' ఉపాధ్యక్షులు కె. వీరయ్య, నాయకులు పి. శ్రీనివాస్‌, డి. మోహన్‌, విలస్ రావ్ తదితరులు పాల్గొన్నారు.

16, డిసెంబర్ 2018, ఆదివారం

2018 ఎన్నికలలో తెలంగాణలో పార్టీలు... వాటి ఓట్లు, సీట్లు...

2018 రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 88 స్థానాల్లో విజయఢంకా మోగించి వరుసగా రెండో సారి అధికారాన్ని చేజిక్కించుకున్నారు.
టీఆర్‌ఎస్‌ -88, కాంగ్రెస్ - 19, ఎంఐఎం- 7, టీడీపీ - 2 , బీజేపీ - 1
రామగుండంలో ‘ఫార్వర్డ్‌ బ్లాక్‌’, వైరాలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు
ఖాతా తెరవని టీజేఎస్, సీపీఐ, సీపీఎం, బీఎల్‌ఎఫ్‌.
..బొక్కబోర్లా పడిన ప్రజాకూటమి, కాంగ్రెస్‌ హేమాహేమీల పరాజయం
..స్పీకర్‌ సహా నలుగురు మంత్రుల ఓటమి.






9, డిసెంబర్ 2018, ఆదివారం

శాసనసభ ఎన్నికల్లో 73.20% పోలింగ్‌....

          2018 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 73.20% పోలింగ్‌ నమోదైంది.
2014తో పోల్చితే 3.7% ఎక్కువ ఓటింగ్‌
అత్యధికంగా మధిర నియోజకవర్గంలో 91.65% నమోదు కాగా, 
ఆ తర్వాతి స్థానాల్లో ఆలేరు (91.33%), మునుగోడు (91.07%), నర్సాపూర్, భువనగిరి (చెరో 90.53%), నర్సంపేట (90.06%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 
               చార్మినార్‌లో అత్యల్పంగా 40.18% పోలింగ్‌ జరగ్గా ఆ తర్వాతి స్థానాల్లో 41.24 శాతంతో యాకుత్‌పురా, 42.74 శాతంతో మలక్‌పేట, 44.02 శాతంతో నాంపల్లి, 45.61 శాతంతో జూబ్లీహిల్స్, 46.11 శాతంతో చాంద్రాయణగుట్ట, 49.05 శాతంతో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 
                 జిల్లాల వారీగా పరిశీలిస్తే 90.95% పోలింగ్‌తో యాదాద్రి–భువనగిరి జిల్లా తొలిస్థానంలో నిలవగా 48.89% ఓటింగ్‌తో హైదరాబాద్‌ జిల్లా చివరన నిలిచింది. గ్రేటర్‌లో 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం 51.73 నమోదైంది. 2014 ఎన్నికలతో పోల్చితే స్వల్పంగా తగ్గింది. (2014 గ్రేటర్‌లో కేవలం 53 శాతం) .  మేడ్చల్ జిల్లాలో 55.85 శాతం పోలింగ్ నమోదైంది. 2014 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే జిల్లాలో 4.96 శాతం పోలింగ్ పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో 61.29 శాతం పోలింగ్ నమోదైంది.









5, డిసెంబర్ 2018, బుధవారం

ప్రధాన పార్టీలలోనే 83 శాతం కోటీశ్వరులు...

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆస్తి అక్షరాల 314కోట్లు. ఆ తరువాత నిజామాబాద్‌ అభ్యర్థి ముత్యాల సునీల్‌కుమార్‌(బీఎస్పీ) 182 కోట్లతో ద్వితీయ స్థానంలో ఉన్నారు. 
నాగర్‌కర్నూల్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన మర్రి జనా ర్దన్‌రెడ్డి తృతీయ స్థానంలో నిలిచారు.

మొత్తం 1,821 మంది అభ్యర్థులు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవగా వారిలో 1,777 మంది తమ ఆస్తులను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చారు. వీరిలో 438 (25%) మంది కోటీశ్వరులు.
రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆస్తి కలిగిన అభ్యర్థులు 192 (11%) మంది ఉన్నారు. 
 120 (7%) మందికి రూ.2 కోట్ల నుంచి 5 కోట్లు, 
275 (15%) మందికి రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్లు, 
453 (26%) మందికి రూ.10 లక్షల నుంచి 50 లక్షలు, 
737 (41%) మంది 10 లక్షల కంటే తక్కువగా ఆస్తి కలిగి ఉన్నారు.

పార్టీల వారీగా చూస్తే టీఆర్‌ఎస్‌ నుంచి 119 అభ్యర్థుల్లో 107 (90%) మంది కోటీశ్వరులు. 
బీజేపీది ద్వితీయ స్థానం. ఆ పార్టీ నుంచి 118 మంది బరిలో ఉంటే వారిలో 86 (73%) మంది కోటీశ్వరులు. 
 ఆతరువాత స్థానాల్లో కాంగ్రెస్‌ 99 మందికి గాను 79 (80%), 
బీఎస్పీ 100 మందికిగాను 26 (26%), 
టీడీపీ నుంచి 13 మంది అభ్యర్థుల్లో 12 (92%) మంది ఉన్నారు. 
119 అభ్యర్థుల్లో 58 మందికి అసలు ఆస్తులు లేవని ప్రకటించారు.
ఈనాడు...04.12.2018

ఓటు హక్కును వినియోగించుకోవాలి...

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్‌బిఐ కాలనీ రిసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ అధ్యక్షులు శ్రీ రాజగోపాల్‌ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ రోజు (05.12.2018) బాగ్‌ అంబర్‌పేట్‌లోని ఎస్‌బిఐ కాలనీ పార్క్‌లో ''హైదరాబాద్‌ జిందాబాద్‌'' మరియు ఎస్‌బిఐ కాలనీ రిసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో ఓటుపై అవగహన పోస్టర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా గురువు సురేంద్ర గారు, లైన్స్‌ క్లబ్‌ నాయకులు విద్య భూషన్‌, డా|| గూలబ్‌ రాణి, కాలనీ నాయకులు రవీంద్రనాథ్‌, హేమలత, డా|| ఆశలత, నారాయణ, కేశవరావు, శ్రీనివాసరాజు, హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు మల్లం రమేష్‌ , కె.వీరయ్య నాయకులు సురేష్‌, రవిప్రసాద్‌, రాంచందర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ రోజు (05.12.2018) ముసారంబాగ్ లోని జ్ఙాన్ దిప్ టవర్స్ లో ''హైదరాబాద్‌ జిందాబాద్‌'' ఆధ్వర్యంలో ఓటుపై అవగహన పోస్టర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. అసోషియేషన్‌ అధ్యక్షులు రవి, ప్రధాన కార్యదర్శి కె భరత్, అసోషియేషన్‌ నాయకులు జగనాథరెడ్డి, కుమార్ , హైదరాబాద్‌ జిందాబాద్‌ ఉపాధ్యక్షులు కె.వీరయ్య తదితరులు పాల్గొన్నారు.


4, డిసెంబర్ 2018, మంగళవారం

ఓటరు చైతన్యం పై హైదరాబాద్ జిందాబాద్ ...

హైదరాబాద్ నగరం లో ఓటరు చైతన్యం పై హైదరాబాద్ జిందాబాద్ స్వచ్ఛంద సంస్థ రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించిన జీహెచ్ఎంసీ కమీషనర్ దాన కిషోర్, అడిషనల్‌ ఎలక్షన్‌ చిఫ్‌ కమీషనర్‌ శ్రీ జ్యోతి బుద్ద ప్రకాష్‌ గారు...


3, డిసెంబర్ 2018, సోమవారం

ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి ఒక్కరూ కోసం ఓటు...

ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి ఒక్కరూ కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలని 
కెసిసిసి, హైదరాబాద్‌ జిందాబాద్‌ రూపొందించిన పోస్టర్‌ ఆవిష్కరణ కాప్రా చౌరస్తాలో జరిగింది. 
కార్యక్రమంలో నాయకులు సంజీవరెడ్డి, సోమయ్య చారి, ఎం. శ్రీనివాస్‌రావు, రమణ, కె.వీరయ్య,  వి. విజరుకుమార్‌, పి.మోహన్‌ తదితరులు పాల్గొంన్నారు. కాప్రాలోని అన్ని కాలనీల నాయకులు పాల్గొంన్నారు.