28, ఏప్రిల్ 2018, శనివారం

తెలంగాణ బిడ్డ సివిల్స్‌ టాపర్‌...

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష 2017 ఫైనల్‌ ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షల్లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్‌ సత్తాచాటారు. దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రతిభావంతులు పోటీ పడే ప్రతిష్టాత్మక సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఆల్‌ ఇండియా టాపర్‌గా నిలిచారు. యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షలను అక్టోబర్‌–నవంబర్‌ 2017ల్లో నిర్వహించింది. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి–ఏప్రిల్‌ 2018లో ఇంటర్వ్యూలు జరిగాయి.

                  మొత్తం 990 పేర్లను ప్రతిష్టాత్మక ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్, ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్, ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌తోపాటు ఇతర కేంద్ర సర్వీసులైన గ్రూప్‌ ఏ,గ్రూప్‌ బీలకు అభ్యర్థులను సిఫార్సు చేసింది. 990 మందిలో 476 జనరల్, 275 ఓబీసీ, 165 ఎస్సీ, 74 ఎస్టీలు ఉన్నారు. వీరిలో 750 మంది పురుషులు, 240 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన వారిలో ఐఏఎస్‌కు 180 మందిని, ఐఎఫ్‌ఎస్‌కు 42 మందిని, ఐపీఎస్‌కు 150 మందిని, కేంద్ర సర్వీసులోని గ్రూప్‌–ఏకు 565 మందిని, గ్రూప్‌–బీ సర్వీసులో 121 మందిని నియమించనున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఖాళీలకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సత్తాచాటారు.

24, ఏప్రిల్ 2018, మంగళవారం

పర్యావరణ ఎగ్జిబిషన్‌ ...Hyderabad zindabad

హైదరాబాద్‌ ఫెస్ట్‌లో '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' ఏర్పాటు చేసిన '' పర్యావరణ ఎగ్జిబిషన్‌ ''ను మేయర్ బొంతు రామ్మోహన్ మరియు కుటుంబసభ్యులు సందర్శించారు.




23, ఏప్రిల్ 2018, సోమవారం

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా '' ఉచిత మెగా వైద్య శిబిరం... Hyderabad zindabad

          ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' ఆధ్వర్యంలో 08.4.2018 బాగ్‌లింగంపల్లిలో మాతృశ్రీ ఇ యాండ్ ఎల్‌ స్కూల్‌ లో ''ఉచిత మెగా వైద్య శిబిరం'' ను నిర్వహించారు. ఈ ఉచిత మెగా శిబిరాన్ని నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌, ప్రముఖ హార్ట్‌ సర్జన్‌ డా|| దాసరి ప్రసాద్‌రావు గారు ప్రారంభించారు.
             డా|| దాసరి ప్రసాద్‌రావు గారు మాట్లాడుతూ వైద్యం ప్రజలందరికీ ప్రాథమిక అవసరమని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చే కృషి అభినందనీయం అని అన్నారు.
              ప్రముఖ ఇఎన్‌టి సర్జన్‌, నోవా హాస్పిటల్‌ అధినేత డా|| ఎం. మోహన్‌ రెడ్డి గారు , ఆర్థో సర్జన్‌ డా|| రామకిషన్‌ గారు , డెంటల్‌ సర్జన్‌  ఇండిన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ ఉపాధ్యాక్షలు డా|| కె. ఆదిత్య సందీప్‌ గారు, చిన్నపిల్లల వైద్యనిపుణులు డా||మహాదేవ్‌ గారు, చర్మవాధుల నిపుణులు డా|| నీనా నిమ్మ గారు, మాజీ మెడికల్‌ ఆఫీసర్‌ డా|| ఎం. ఉపేందర్‌ రెడ్డి గారు, గెండె సర్జన్‌ డా|| వెంకటేష్‌ గారు ఆయా విభాగాలలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. శిబిరంలో గుండె, చెవి ముక్కు గొంతు, కంటి, దంతం, చిన్నపిల్లలు, చర్మ వ్యాధులు,జనరల్‌ వంటి ప్రధానమైన అన్ని వ్యాధులకు సంబంధించిన సమస్యల వైద్యం, టెస్టులు, అవగాహన కార్యక్రమాలు జరిగినాయి.  
భా రీ వర్షం వచ్చిన, కాని ఉచిత మెగా వైద్య శిబిరం లో దాదాపు 450 మంది పాల్గొన్నారు
               సీనియర్‌ జర్నలిస్ట్‌, హైదరాబాద్‌ జిందాబాద్‌ అధ్యక్షులు శ్రీ పాశం యాదగిరి గారు , ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్‌రావు, ఉపాధ్యక్షులు కె. వీరయ్య, వి. విజరుకుమార్‌, నాయకులు పి. నాగేశ్వరరావు, పి.శ్రీనివాస్‌, టిఎన్‌వి రమణ, జెకె శ్రీనివాస్‌ లు నాయకత్వం వహించారు. ప్రభాకర్‌, పి. నాగేష్‌, వెంకటేష్‌, మణిక్యం, సంగీత, దుర్గ, కె. రాజ్యలక్ష్మి, లత, అజరు, మోహన్‌రెడ్డి, నవీన్‌కృష్ణ తదితరులు సేవలందించారు. 
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా '' ఉచిత మెగా వైద్య శిబిరం..దృశ్యాలు