26, మే 2018, శనివారం

నాలాపై ప్రమాదకరంగా వున్న మ్యాన్‌ హోళ్లకు మరమ్మతులు చేయాలని ...Hyderabad zindabad

              నల్లకుంట డివిజన్‌లో పాత రామాలయం లైన్‌లో నాలాపై ప్రమాదకరంగా వున్న మ్యాన్‌ హోళ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని, నాలా పూడిక తీయాలని ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. భారీ వాహనాలు రాకుండా ఐరన్‌ కమాన్‌ ఏర్పాటు చేయాలని '' నల్లకుంట పాత రామాలయం లైన్‌ రిస్సిడెట్స్‌ అసోషియేషన్‌ '' తరపున ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించడం జరిగింది.
          ఈ కార్యక్రమంలో లో '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' ఉపాధ్యక్షులు కె. వీరయ్య, '' నల్లకుంట పాత రామాలయం లైన్‌ రిస్సిడెట్స్‌ అసోషియేషన్‌ '' ఉపాధ్యక్షులు బి. బాలకృష్ణ రెడ్డి (అడ్వకేట్‌ ) , సహాయ కార్యదర్శి బి. అజరుకుమార్‌ రెడ్డి , ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ గడ్డం వినోద్‌ కుమార్‌ పాల్గొన్నారు.





20, మే 2018, ఆదివారం

మ్యాన్‌ హోల్స్‌కు మరమ్మతులు... Hyderabad zindabad

నల్లకుంట డివిజన్‌లో పాత రామాలయం ఏరియాలో ఎస్‌బిఐ బ్యాంక్‌ - క్షత్రియా టవర్స్‌ లైన్‌లో పగిలిపోయి, కూలిపోవడానికి సిద్ధంగా వున్న మ్యాన్‌ హోల్స్‌కు మరమ్మతులు చేశారు. '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' ఆధ్వర్యంలో చాల సార్లు కంప్లయింట్స్‌ చేయడంతో నేడు జిహెచ్‌ఎంసి ఏఇ ఉపేందర్‌ గారు సందర్శించి ప్రమాదకరంగా మ్యాన్‌ హోల్‌ మరమ్మతులు చేయించి, కొన్ని కవర్‌లు మార్చారు. ఈ కార్యక్రమంలో '' హైదరాబాద్‌ జిందాబాద్‌ '' నగర ఉపాధ్యక్షులు కె. వీరయ్య, సీనియర్‌ సిటిజన్‌ నాయకులు డి. రామకృష్ణరావు, కృష్ణబాబు, స్థానిక నాయకులు అజరుకుమార్‌ రెడ్డి, డి. మోహన్‌, పి. శ్రీనివాస్‌, సునిల్‌ తదితరులు పాల్గొన్నారు.





6, మే 2018, ఆదివారం

భూగర్భ జలాలను కాపాడుకుదాం... Hyderabad zindabad

ఇంకుడు గుంతలు నిర్మిద్దాం - భూగర్భ జలాలను కాపాడుకుదాం...
ఈనాడు, హైదరాబాద్ జిందాబాద్ ల ఆధ్వర్యంలో 05.05.2018 శనివారం ఉదయం ఇంకుడు గుంతలపై అవగాహన ప్రదర్శన జరిగింది.. పాత నల్లకుంట క్షత్రియ టవర్స్ లెన్, పాత రామాలయం రోడ్డులో ..డా|| జయాసూర్య , డి. రామకృష్ణరావు , మోహన్‌ రావు , టి. భూపాల్‌,, 
వై. శ్రీనివాస్‌రావు, కృష్ణబాబు, వీలాస్‌, షాకీర్‌ తదితరులు పాల్గొన్నారు.