9, డిసెంబర్ 2018, ఆదివారం

శాసనసభ ఎన్నికల్లో 73.20% పోలింగ్‌....

          2018 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 73.20% పోలింగ్‌ నమోదైంది.
2014తో పోల్చితే 3.7% ఎక్కువ ఓటింగ్‌
అత్యధికంగా మధిర నియోజకవర్గంలో 91.65% నమోదు కాగా, 
ఆ తర్వాతి స్థానాల్లో ఆలేరు (91.33%), మునుగోడు (91.07%), నర్సాపూర్, భువనగిరి (చెరో 90.53%), నర్సంపేట (90.06%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 
               చార్మినార్‌లో అత్యల్పంగా 40.18% పోలింగ్‌ జరగ్గా ఆ తర్వాతి స్థానాల్లో 41.24 శాతంతో యాకుత్‌పురా, 42.74 శాతంతో మలక్‌పేట, 44.02 శాతంతో నాంపల్లి, 45.61 శాతంతో జూబ్లీహిల్స్, 46.11 శాతంతో చాంద్రాయణగుట్ట, 49.05 శాతంతో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 
                 జిల్లాల వారీగా పరిశీలిస్తే 90.95% పోలింగ్‌తో యాదాద్రి–భువనగిరి జిల్లా తొలిస్థానంలో నిలవగా 48.89% ఓటింగ్‌తో హైదరాబాద్‌ జిల్లా చివరన నిలిచింది. గ్రేటర్‌లో 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం 51.73 నమోదైంది. 2014 ఎన్నికలతో పోల్చితే స్వల్పంగా తగ్గింది. (2014 గ్రేటర్‌లో కేవలం 53 శాతం) .  మేడ్చల్ జిల్లాలో 55.85 శాతం పోలింగ్ నమోదైంది. 2014 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే జిల్లాలో 4.96 శాతం పోలింగ్ పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో 61.29 శాతం పోలింగ్ నమోదైంది.









1 కామెంట్‌: