25, మే 2019, శనివారం

ఆంధ్రప్రదేశ్‌ లో ఫ్యాన్‌ హోరు...

- వైసిపి151
- టిడిపి 23
- జనసేన 1
లోక్‌సభ స్థానాలు :  - వైసిపి 22    - టిడిపి 3
                        ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. శాసనసభతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ ఆ పార్టీ పూర్తిస్థాయిలో ఆధిక్యత సాధించింది. ఫ్యాన్‌ హోరు ధాటికి తెలుగుదేశం పార్టీ బేజారెత్తింది. ఎన్నడూ లేని విధంగా ఘోర ఓటమిని మూటకట్టుకుంది. 175 శాసనసభ స్థానాలకు గానూ, 151 స్థానాల్లో వైసిపి అభ్యర్థులు గెలుపొందగా, 23 స్థానా లకు టిడిపి, జనసేన 1 కి పరిమితమైంది. పులివెందుల నుండి ఎన్నికల బరిలోకి దిగిన వైసిపి అధినేత జగన్మో హన్‌రెడ్డికి 90వేలకు పైగా రికార్డు ఓట్లను సాధించారు. అదేసమయంలో టిడిపికి చెందిన పలువురు సీనియర్‌ నేతలు, మంత్రులు ఓటమి పాలయ్యారు. మంగళగిరి నుండి ఎన్నికల బరిలోకి దిగిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడి కుమారుడు, రాష్ట్ర మంత్రి లోకేష్‌ ఓటమి పాలయ్యారు. 







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి