24, అక్టోబర్ 2018, బుధవారం

పటాకులు రెండు గంటలే..

బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు హర్షణీయం, అభినందనీయం. హైదరాబాద్‌ జిందాబాద్‌ సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నది. కాలుష్యం మానవ మనుగడకు ముప్పు కలిగిస్తున్న తరుణంలో పండుగలన్నీ పర్యావరణహితంగా జరుపుకోవాలని కోరుచున్నాము. దేశవ్యాప్తంగా దీపావళి, ఇతర పండుగలలో రాత్రి 8 నుండి 10 గంటల వరకే బాణాసంచా కాల్చాలనీ, నూతన సంవత్సరం, క్రిస్మస్‌లలో రాత్రి 11.55 నుండి 12.30 వరకు కాల్చాలనీ, ఆన్‌లైన్‌- వెబ్‌సైట్లలో టపాసులు అమ్మడానికి వీల్లేదని, తక్కువ కాలుష్యం వెదజల్లే టపాసులకే అనుమతి ఇవ్వాలని అనేక ఆంక్షలతో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అభినందనీయం.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి