25, జులై 2018, బుధవారం

స్పూర్తిదాయక ప్రభుత్వ సుపరిపాలన లో టాప్‌లో కేరళ రాష్ట్రం..

స్పూర్తిదాయక ప్రభుత్వ సుపరిపాలన లో టాప్‌లో కేరళ రాష్ట్రం...3వ ర్యాంకు తెలంగాణ రాష్ర్టం, 9వ ర్యాంకు  ఏ.పి
                 కేరళ రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని, ప్రజలు సామా జికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యంత ఉపయుక్తంగా ఉన్నాయని పబ్లిక్‌ అఫైర్స్‌ సెంటర్‌(పీఏసీ) నివేదిక వెల్లడించింది. కర్నాటకకు చెందిన పీఏసీ విడుదల చేసిన పబ్లిక్‌ అఫైర్స్‌ ఇండెక్స్‌ 2018 నివేది క ఈ మేరకు వివరించింది. మొత్తం 30 ప్రధానమైన విషయాలు, 100 సూచికలను మదించి ఈ నివేదికను రూపొందించినట్టు పీఏసీ తెలిపింది. ప్రయివేటు సమాచారాన్ని కాకుండా ప్రభుత్వ అధికారిక సమాచారాన్నే ఈ నివేదిక రూపకల్పనకు వినియోగించామని తెలిపింది. దేశంలోని మొత్తం రాష్రా ్టలను జనాభా ఆధారంగా పెద్ద, చిన్న రాష్ట్రాలుగా విభజించి వాటి ర్యాంకులను నిర్ణయిస్తామని వివరించింది. కాగా, ఏడాదికోసారి విడుదల చేసే ఈ నివేదికలో కేరళ టాప్‌లో రావడం వరసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి